ఫ్లాష్ న్యూస్… ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వినయ్ కుమార్ రెడ్డి ఖరారు

ఆర్మూర్ టౌన్, అక్టోబర్ 15 (ప్రజా శంఖారావం):

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించిన తొలి జాబితాలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పేరు ఖరారైంది. ఈ నేపథ్యంలో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మధుయాష్కీ, జిల్లా డిసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, ఏఐసీసీ నేత మహేష్ కుమార్ గౌడ్, స్థానిక ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు వినయ్ కుమార్ రెడ్డి తన అభ్యర్థిత్వానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో తనకు సహకరించాలని, ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో టికెట్ ఖరారు కావడంతో ఆయన అభిమానులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.