బిజెపి పార్టీలో చేరిన బిఆర్ఎస్ మాజీ పట్టణ అధ్యక్షులు

ఆర్మూర్ టౌన్, అక్టోబర్ 29 (ప్రజా శంఖారావం):

నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ సమక్షంలో పట్టణ కేంద్రంలోని బిజెపి అసెంబ్లీ అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఉదయం బిఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ పట్టణ మాజీ అధ్యక్షులు కలిగోట గంగాధర్ బిజెపి పార్టీలో చేరారు. బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి బిజెపి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ బిజెపి పార్టీ వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గంలో బిజెపి పార్టీ గెలుపుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు పల్లె గంగారెడ్డి, ఆలూరు విజయభారతి, జీవి నరసింహారెడ్డి, జెస్సు అనిల్, పాలేపు రాజు, ఆకుల శ్రీను, మందుల బాలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.