Credit Card Holders Alert: క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా..! ఏప్రిల్ ఒకటి నుంచి బెనిఫిట్స్ కి బ్రేక్..!

Credit Card Holders Alert
Credit Card Holders Alert

Credit Card Holders Alert: రోజు రోజుకి వివిధ బ్యాంకులు ఇచ్చే క్రెడిట్ కార్డులు వాడడం క్రేజీ అయిపోయింది తమ అవసరాలకు క్రెడిట్ కార్డు వాడుతున్నారు జనాలు. ఇందుకోసం మనకు బ్యాంకులో అందిస్తున్న క్రెడిట్ కార్డులకు సంబంధించిన అప్డేట్లను కూడా మనం తెలుసుకోవాలి. క్రెడిట్ కార్డు వల్ల లాభాలు ఎంతనో వాటి బెన్ఫిట్స్ అప్డేట్స్ కూడా తెలుసుకుంటే కార్డు ఎప్పుడు ఎక్కడ ఎలా వాడుకోవాలో మనకు తెలిసిపోతుంది. ఇది సంబంధించి బ్యాంకులో ఆర్థిక సంస్థలు తీసుకునే నిర్ణయాలతో క్రెడిట్ కార్డు వాడుతున్న వారిపై కాస్తంత ప్రభావం చూపుతుందని చెప్పవచ్చు. క్రెడిట్ కార్డ్ చార్జీలు పేమెంట్ విధానం జరిమానాలు రివార్డు పాయింట్లకు సంబంధించి చిన్న చిన్న మార్పులను గమనించాలి. ఎస్బిఐ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు ఇలా క్రెడిట్ కార్డ్ రూల్స్ ను వచ్చే నెల ఒకటి నుంచి మారుస్తున్నట్లుగా సమాచారం.

ఎస్బిఐ, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లు తమ క్రెడిట్ కార్డ్ రూల్స్ ను వచ్చే నెల నుంచి మారుస్తున్నట్లుగా సమాచారం. విస్తారా ఎయిర్‌లైన్స్ కలిసి గతంలో ‘క్లబ్ విస్తారా ఐడీఎఫ్‌సీ ఫస్ట్ క్రెడిట్ కార్డు’ ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌ లు విడుదల చేశాయి. ఈ క్రెడిట్ కార్డు తీసుకున్న వినియోగదారులకు ఎన్నో లాభాలు అందుతున్నాయి. ముఖ్యంగా, మైల్‌స్టోన్ బెనిఫిట్స్, మహారాజా పాయింట్లు అందేవి.

క్లబ్ విస్తారా సిల్వర్ మెంబర్‌షిప్ అందుబాటులో ఉండటంతో ఒక ప్రీమియం ఎకానమీ టికెట్, ఒక వన్ క్లాస్ అప్‌గ్రేడ్ కాంప్లిమెంటరీ ఓచర్లను వినియోగదారులు పొందారు. అదనంగా, ప్రీమియం ఎకానమీ టికెట్లకు మైల్‌స్టోన్ ఓచర్స్ జారీ అయ్యేవి. అలాగే మహారాజా పాయింట్ల పేరు మీద వినియోగదారులకు కొన్ని బెనిఫిట్స్ వచ్చేవి. అయితే, 2025, ఏప్రిల్ 1 నుంచి ఈ రివార్డు పాయింట్లు, బెనిఫిట్స్ విషయంలో కోత ఉండబోతోంది. ఇప్పటివరకు కొనసాగించిన క్లబ్ విస్తారా సిల్వర్ మెంబర్‌షిప్.. ఇక నుంచి అందుబాటులో ఉండదు. ఒక ప్రీమియం ఎకానమీ టికెట్, ఒక వన్ క్లాస్ అప్‌గ్రేడ్ వంటి కాంప్లిమెంటరీ ఓచర్లు కూడా బంద్. అంతేగాకుండా, ప్రీమియం ఎకానమీ టికెట్లకు మైల్‌స్టోన్ ఓచర్లు ఇకనుంచి ఇష్యు చేయరు.

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లకు కొన్ని బెనిఫిట్స్ రద్దు అవుతున్నా.. మరికొన్ని మాత్రం యధావిధిగా ఉండబోతున్నాయి. మహారాజా పాయింట్లను పొందేందుకు కస్టమర్లకు అవకాశం ఉంది. కార్డు చెల్లుబాటు అయ్యేంతవరకు.. అంటే, 2026, మార్చి 31 వరకు ఈ రివార్డు పాయింట్లు యూజర్లకు లభిస్తాయి. మరోవైపు, 2025, మార్చి 31 తర్వాత ఈ క్రెడిట్ కార్డును రెన్యువల్ చేయించుకునే కస్టమర్లకు కాస్త ఊరట దొరికింది. ఈ కార్డుపై విధించే యాన్యువల్ ఫీజు నుంచి సంవత్సర కాలానికి మినహాయింపును ఇచ్చింది. అంటే, కార్డ్ చివరి ఏడాదిలో ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదన్నమాట.

‘క్లబ్ విస్తారా ఎస్బీఐ ప్రైమ్ క్రెడిట్ కార్డ్’, ఎస్బీఐ ‘క్లబ్ విస్తారా ఎస్బీఐ కార్డ్‌’ లకు దాదాపుగా ఇలాంటి మార్పులనే వెలువరించింది. రెన్యువల్ బెనిఫిట్స్ కింద ఇప్పటివరకు అందించిన ఎకానమీ లేదా ప్రీమియం ఎకానమీ టికెట్ ఓచర్లను 2025, ఏప్రిల్ 1 నుంచి కస్టమర్లు ఇక పొందలేరు.

క్లబ్ విస్తారా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్.. రూ.1.25 లక్షలు, రూ.2.5 లక్షలు, రూ.15 లక్షల వార్షిక ఖర్చులు చేసిన వారికి ఈ ఎకానమీ టికెట్ ఓచర్‌ను, మైల్‌‌స్టోన్ బెనిఫిట్స్‌ అందించింది. ఇకపై, ఈ బెనిఫిట్స్ క్లోజ్. ఇక, క్లబ్ విస్తారా ఎస్బీఐ ప్రైమ్ క్రెడిట్ కార్డ్ యూజర్ల కూడా ప్రీమియం ఎకానమీ టికెట్ ఓవచర్లను కోల్పోనున్నారు. ఎస్బీఐ కార్డ్‌, క్లబ్ విస్తారా రెన్యువల్ ఫీజు రూ.1,499 కాగా, ప్రైమ్ కార్డ్ రెన్యువల్ రూ.2,999గా వసూల్ చేయనున్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now