Baba Vanga: ఆందోళనకు గురి చేస్తున్న .. బాబా వంగ జ్యోతిష్యం.. 2025లో జరిగేది ఇదే

Baba Vanga
Baba Vanga

Baba Vanga: బల్గేరియా కు చెందిన బాబా వంగా గురించి చాలామందికి తెలుసు. ఆమె తన కంటి చూపు కోల్పోయిన సమయం నుంచి భవిష్యత్తును చూడగలిగే జ్ఞాన దృష్టిని పొందారని చాలామంది నమ్ముతారు. అప్పటినుంచి ఆమె చెప్పిన భవిష్యత్తు అంచనాలు అన్ని దాదాపు నిజమయ్యాయని చెప్తున్నారు. బాబా అంచనా 2025 సంవత్సరం గురించి కూడా చెప్పిన జ్యోతిష్యం అంచనాలు దాదాపుగా అన్ని నిజమవుతున్నాయి అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈమె 2025 గురించి చెప్పిన అంచనాలపై ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో కూడా ఆందోళన కలుగుతుంది. ఈ ఏడాదిలో ఏం జరుగుతుందో అనే ఆందోళన ప్రతి ఒక్కరిలో కూడా నెలకొంది. అప్పట్లో బాబా వంగ 2025 సంవత్సరంలో కొన్ని భయానిక సంఘటనలు చోటు చేసుకుంటాయి అని చెప్పడం జరిగింది.

అయితే బాబా వంగ 2025 సంవత్సరంలో ప్రపంచం అంతమవుతుంది అని కూడా వెల్లడించారు. గతంలో కూడా బాబావంగా 2012 సంవత్సరం ప్రపంచం అంతమవుతుంది అని చెప్పారు. కానీ అలా ఏమి జరగలేదు. అయితే బాబా వంగ 5079 నాటికి మానవజాతి మొత్తం భూమి మీద లేకుండా అంతరించిపోతుంది అని జ్యోతిష్యం తెలిపారు. అప్పట్లో 2025 గురించి ఆమె వేసిన అంచనాల ప్రకారం 2025లో ప్రపంచంలో భారీ యుద్ధాలు మరియు ఘర్షణలు జరుగుతాయి అని తెలిపారు. బాబా వంగ అంచనా వేసిన ప్రకారం 2025లో ప్రపంచవ్యాప్తంగా భారీ యుద్ధాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

బాబా వంగ ఐరోపా లో భారీ యుద్ధం జరగవచ్చని దాని కారణంగా భారీ నష్టం తప్పదు అని ఊహించి చెప్పారు. ప్రపంచంలో 2025లో అనేక దేశాలలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇజ్రాయిల్ మరియు ఇరాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ప్రపంచంలో జరుగుతున్న యుద్దాల కారణంగా ప్రపంచ జనాభా గణనీయంగా తగ్గిపోతుందని ఆ తర్వాత మానవులు మానవుల మనుగడ కోసం కొత్త వనరులను వెతుక్కోవలసిన పరిస్థితి కూడా ఉంటుంది అని ఇక ఆ తర్వాత పరిస్థితులు మరింత భయానికంగా మారే అవకాశం ఉందని అప్పట్లో బాబా వంగ అంచనా వేశారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now