Metpally: మెట్ పల్లి/మల్లాపూర్, జూన్14 (ప్రజా శంఖారావం): విద్యుత్ షాక్ తో అసిస్టెంట్ లైన్ మెన్ మృతి చెందిన ఘటన మల్లాపూర్ మండలం వాల్గొండలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వాల్గొండ గ్రామంలో జూనియర్ లైన్ మెన్ గా దుంపేట రాజేశం విధులు నిర్వర్తిస్తున్నాడు. తన విదులలో భాగంగా పొలానికి వెళ్లే విద్యుత్ లైన్ ను ఆఫ్ చేసిన సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కరెంట్ సరఫరాను ఆన్ చేసినట్లు స్థానికులు తెలిపారు. మృతుని స్వస్థలం కోరుట్ల మండలంలోని మోహన్ రావు పేట గ్రామం, మృతునికి ఒక కుమారుడు కూతురు ఉన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి
Join WhatsApp Group
Join Now