NPS Vatsalya Scheme: పిల్లల బంగారు భవిష్యత్తు కోసం.. సూపర్ స్కీం.. రూ.1.80 లక్షల పెట్టుబడితో.. 11.05 కోట్ల రాబడి..
కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా అనేక పథకాలు అందుబాటులో ఉన్నవి. అదే విదంగా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంక్ లు కూడా పొదుపు చేస్తున్న వారికి పోటీపడి వడ్డీ చెల్లిస్తున్నాయి. వారం, నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాదికోసారి చెల్లించే విదంగా పొదుపు పథకాలు నేడు అనేక విధాలుగ అందుబాటులో ఉన్నవి.
ఇంకా చెప్పాలంటే పోస్ట్ ఆఫీస్ సిబ్బంది అయితే నేరుగా ఇంటికే వచ్చి పొదుపు ఖాతా ఇస్తున్నారు. పోస్ట్ ఆఫీస్ లో అయితే ఆన్లైన్ లో కూడా పొదుపు చేస్తున్న డబ్బు చెల్లించడానికి అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్ లో కూడా అనేక రకాల పొదుపు స్కీమ్ లు ఉన్నవి. తొందర పడకుండా ఎందులో వడ్డీ ఎక్కువగా వస్తుందో తెలుసుకొని పొదుపు చేస్తే పిల్లలకు ఉపయోగకరంగా ఉంటుంది.
బిడ్డ పుట్టగానే ఎన్పిఎస్ వాత్సల్య పథకంలో పెట్టుబడి పెడితే వారికి ఎంతో ఉపయోగపడుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ పథకంలో నెలకు రూ : 15 వేల చొప్పున పొదుపు చేయాలి. ఏడాదికి రూ. 1.80 లక్షల పెట్టుబడి అవుతుంది. 18 ఏళ్ల నాటికి మీరు పెట్టిన పెట్టుబడిపై 10శాతం వడ్డీ కలిసి వస్తుంది. రూ. 5 లక్షల అదనపు ఆదాయం వస్తుంది. ఈ రూ. 5 లక్షలపై 60 ఏళ్ల వరకు ఎలాంటి పొదుపు చేయకుండానే వడ్డీ పొందదానికి అవకాశం ఉంది. 10శాతం రాబడిని పొందితే.. 60సంవత్సరంల వరకు రూ. 2.75 కోట్ల రాబడి పొందవచ్చు. 20 ఏళ్ల గణాంకాల ప్రకారం 12.86 శాతం ఆదాయంతో రూ. 5 లక్షల నుంచి రూ. 11.05 కోట్లకు ఆదాయం పెరుగుతూ వస్తుంది.