KTR Vs Congress: నార్కో పరీక్షలు చేయెంచే దమ్ముందా.. కేటీఆర్ సవాల్ కు.. కాంగ్రెస్ నేతల ప్రతి సవాల్..కేటీఆర్ వి మేకపోతు గాంభీర్యమే..
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ నోటీసులు పంపిస్తోంది. లోన ఆందోళనతో ఉన్నప్పటికీ బయటకు రానీయకుండా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. లైడిటెక్టర్ పరీక్షకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమా అంటూ కేటీఆర్ విసిరిన సవాల్ కు కాంగ్రెస్ నేతలు కూడా దీటుగానే స్పందిస్తున్నారు. మీ వద్ద నిజాయితీ ఉంటె ముందుగా మీ తండ్రి తో పాటు మీ చెల్లె కవిత, మీ భావ హరీష్ రావుకు నార్కో పరీక్షలు చేయెంచే సత్తా ఉందా అంటూ ఎదురుదాడికి దిగారు కాంగ్రెస్ నేతలు. సవాల్ చేస్తారు. బయపడి పారిపోతారు. ఇది మీ నైజం అంటు కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
గతంలో డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో వైట్ ఛాలెంజ్ కు రమ్మంటే పారిపోయింది ప్రజలకు తెలుసు. రాష్ట్ర అభివృద్ధి చేస్తున్న విధానం చూస్తున్న మీకు ఏమి మాట్లాడాలో తెలియడం లేదంటూన్నారు కాంగ్రెస్ నేతలు. జైలు కు వెళ్లాలనే తొందర కేటీఆర్ కు ఉండటంతోనే తోచిన విధంగా కేటీఆర్ మాట్లాడుతున్నారు. మీ జైలు కోరికను దర్యాప్తు సంస్థలు కూడా అతి తొందరలోనే తీరుస్తాయని , అందుకు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ ను కాంగ్రెస్ నేతలు కోరడం విశేషం. కేసీఆర్ అతి తెలివితోనే కాళేశ్వరం కూలిపోయింది. అందులో జరిగిన అవినీతి కూడా త్వరలోనే కక్కిస్తామని కూడా కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు.
కేసీఆర్ కు కవిత రాసిన లేఖ ఎవరు బయట పెట్టారో చెప్పే దయిర్యం ఉందా అని కాంగ్రెస్ నేతలు బిఆర్ఎస్ నేతలను నిలదీస్తున్నారు. లేఖలోని అంశాలపై కవితకు కేసీఆర్ ఎందుకు సమాధానం చెప్పలేదు. న్యాయవిచారణకు కేసీఆర్ వెళుతున్నప్పుడు కవిత ఎందుకు వెళ్ళలేదు. కవిత ప్రత్యేకంగా కార్యాలయం ప్రారంభించినప్పుడు కుటుంబ సభ్యులు ఎండలు వెళ్ళలేదు. వీటన్నిటికీ సమాధానం చెప్పలేక సీఎం రేవంత్ రెడ్డి పై ఆరోపణలు చేయడం సరికాదని, ఇలాంటి ఆరోపణలు చేస్తే తగిన బుద్ధి చెప్పక తప్పదని కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు.