Medigadda Project: మేడిగడ్డ నివేదికతో క్రిమినల్ చర్యలకు.. ప్రభుత్వం రంగం సిద్ధం..

Medigadda Project
Medigadda Project

Medigadda Project: మేడిగడ్డ నివేదికతో క్రిమినల్ చర్యలకు.. ప్రభుత్వం రంగం సిద్ధం..

తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పై నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ 2023 లో కుంగిపోయింది. దీనిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ అధికారులు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. మార్చి నెలలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విజిలెన్స్ కమిషన్ కు నివేదిక అందజేశారు. అందులో పొందుపరిచిన సిపార్సులను అమలుచేయాలని కోరుతూ రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శికి మార్చి 18 న విజిలెన్స్ కమిషన్ లేఖ రాసింది. నివేదిక అంది మూడు నెలలు దాటింది. అయినా చర్యలు ఎందుకు చర్యలు తీసుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల సమావేశంలో చర్చించినట్టు సమాచారం.

బ్యారేజ్ నిర్మాణంలో పలు అక్రమాలు జరిగినట్టుగా ఎన్ఫోర్స్మెంట్ గుర్తించింది. నిర్మాణంకు సంబందించిన పలువురు సీనియర్ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఎన్ఫోర్స్మెంట్ నివేదికలో ఉంది. మిగిలిన వారిపై కూడా శాఖా పరంగా చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ సిఫార్స్ చేసింది. అయినప్పటికీ చర్యలు తీసుకోవడంలో నీటి పారుదల శాఖ నిర్లక్ష్యం వహించినట్టుగా సీఎం గుర్తించారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం నివేదిక గురించి సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు. చర్చల నేపథ్యంలో విజిలెన్స్ మ్యానువల్ ప్రకారం చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. కొద్దీ రోజుల్లోనే సంబంధింత ఇంజనీర్లకు షోకాజ్ నోటీసు ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now