Nizamabad: యువకుని ఆత్మహత్యాయత్నం చర్చనీయాంశం..!

Nizamabad
Nizamabad
  • ఆ అధికారి బెదిరింపుతో కలతచెంది ఆత్మహత్యయత్నం..?
  • ఆ పోలీస్ అధికారి స్థాయి చేతిపై రక్తంతో రాసుకున్న యువకుడు..?
  • ఓ మాజీ ప్రజా ప్రతినిధి, ఇద్దరు నాయకుల ఎదురుగా తనను ముద్దాయిగా నిలబెట్టారని ఆవేదన..?
  • సివిల్ పంచాయతీలో జోక్యంపై జిల్లా పోలీసు బాస్ సీరియస్..!
  • యువకుని ఆత్మహత్యాయత్నం ఘటనపై జిల్లా బాస్ విచారణ..!

Nizamabad: నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, జూన్ 17 (ప్రజా శంఖారావం): నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ పరిధిలోని ఓ పోలీసు అధికారి సివిల్ పంచాయతీలో జోక్యం చేసుకొని యువకుడిని బెదిరించడంతో మనస్థాపానికి గురైన ఆ యువకుడు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై జిల్లా పోలీస్ బాస్ నివేదిక తెప్పించుకుని ఆ పోలీస్ అధికారి తీరుపై, సివిల్ పంచాయతీలో జోక్యం చేసుకోవడంపై సీరియస్ గా ఉన్నారని, విచారణ చేస్తున్నట్లుగా సమాచారం. జిల్లా కేంద్రంలోని ఆర్మూర్ డివిజన్ పరిధిలో యువకుని ఆత్మహత్యాయత్నం ఘటన చోటు చేసుకోవడంపై జిల్లాలో సర్వత్ర చర్చనీయాంశమైంది. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని ప్రముఖ వ్యాపారి కొడుకు మరో రియల్ ఎస్టేట్ వ్యాపారికి మధ్య జరిగిన లావాదేవీల విషయంలో సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆ పోలీస్ అధికారిని ఆశ్రయించినట్లుగా కనబడుతుంది.

సదరు వ్యాపారి కొడుకుని ఆ పోలీస్ అధికారి తన కార్యాలయానికి పిలిపించుకొని దుర్భాషలాడుతూ, బెదిరించడంపై మనస్థాపానికి గురైన ఆ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్లుగా తెలుస్తుంది. ఇదే సమయంలో ఆ అధికారి స్థాయిని సూచిస్తూ ఆ యువకుడు చేతిపై రాసుకున్నట్లుగా సమాచారం. సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారితో తనకు ఎలాంటి సంబంధం లేదని, తన అన్న కు, ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారికి మధ్య లావాదేవీలు జరిగాయని, ఇందులో తమ తండ్రి పేరు వాడవద్దని ఆ పోలీస్ అధికారికి ఆ యువకుడు విన్నవించినట్లుగా సమాచారం. కానీ ఆ పోలీస్ అధికారి యువకుని తండ్రి పేరుతో దుర్భాషలాడుతూ మాట్లాడడంపై ఆ యువకుడు కలత చెందినట్లుగా యువకుని సన్నిహితులు చెబుతున్నారు.

సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారితో ఆర్థిక లావాదేవీల్లో బాధితుని అన్నకు మధ్య జరిగిన లావాదేవీల్లో రిజిస్ట్రేషన్లు కూడా పూర్తయ్యాయని, ఇప్పుడు మళ్లీ పోలీసులు జోక్యం చేసుకొని బెదిరించడం సమంజసం కాదని యువకుని సన్నిహితులు వాపోతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి తరపున ఓ మాజీ ప్రజా ప్రతినిధి, ఓ పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు వత్తాసు పలుకుతూ దగ్గరుండి మరి ఆ యువకుడ్ని పిలిపించి సదరు పోలీస్ అధికారితో బెదిరించారని చెబుతున్నారు. పోలీస్ అధికారి కార్యాలయంలో అరగంట పాటు ముద్దాయిగా నిలబెట్టి ఆ ముగ్గురు నాయకుల ఎదురుగా దుర్భాషలాడుతూ, బెదిరించడం పై యువకుడు కలత చెందినట్లుగా, చేయని తప్పుకు దుర్భాషలాడడం బెదిరించడం ఏంటని సన్నిహితులు అంటున్నారు. రక్షించాల్సిన పోలీసులే బెదిరింపులకు పాల్పడుతూ యువకుని ఆత్మహత్యాయత్నానికి కారణమవ్వడం నిజామాబాద్ జిల్లాలో  ఇప్పుడు చర్చనీయ అంశంగా మారింది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now