Hyderabad: ఈ ప్రాంతంలో భూమి పై పెట్టుబడి పెడితే.. కోటీశ్వరులు అవ్వడం ఖాయం.. ఎందుకంటే

Hyderabad
Hyderabad

Hyderabad: హైదరాబాద్ నగరంలో ఎప్పటికీ భూములకు డిమాండ్ బాగా ఉంటుంది. అయితే ఇటీవల రియల్ ఎస్టేట్ హైదరాబాద్ నగరంలో కొంచెం డబ్బు ముఖం పట్టినప్పటికీ కూడా రాబోయే రోజులలో మాత్రం అక్కడ రియల్ ఎస్టేట్ బూమ్ పెరగడం ఖాయం అని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో వసతిచ పరిశ్రమల స్థాపనకు అనువైన భూములకు హైదరాబాద్ నగరంలో బాగా డిమాండ్ పెరుగుతుంది అని చెప్పొచ్చు. ముఖ్యంగా హైదరాబాదు మధ్యలో ఔటర్ రింగ్ రోడ్డు, రింగ్ రోడ్డు వంటి ప్రాంతాలు ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉండడంతో అక్కడ భూములకు ఓ రేంజ్ లో డిమాండ్ పెరుగుతుంది. ఈ క్రమంలో ఆర్థిక నిపుణులు ముఖ్యంగా హైదరాబాదులో ఈ ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్తున్నారు.

రాష్ట్ర రెవెన్యూ శాఖ మరియు స్టాంపులు రిజిస్ట్రేషన్లు శాఖలు ఈ పెరుగుతున్న డిమాండ్ ను ఒక ఆదాయం వనరుగా మార్చుకోవడానికి కొన్ని కీలక ప్రణాళికలను రెడీ చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో భూమి ధరలు పెరగడంతో ఈ శాఖలో అక్కడ మార్కెట్ విలువను రెట్టింపు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ హాట్ స్పాట్ లేదా మారిన ప్రాంతాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఫ్యూచర్ సిటీ, ఫార్మా హబ్ లు, ఇండస్ట్రియల్ క్లస్టర్లు, యువభారత్ స్పోర్ట్స్ మరియు స్కిల్ యూనివర్సిటీలు వంటి ప్రాజెక్టులైన ప్రకటించడంతో ఇక్కడ భూముల విలువ మరింత పెరుగుతుంది అని అంచనా వేస్తున్నారు.

ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టులు పూర్తి అయితే అక్కడ వేలాది మందికి ఉద్యోగ అవకాశాల తో పాటు వాణిజ అవకాశాలు కూడా రావడం వలన అక్కడ భూములపై ఆదాయం దృష్టిలో పెట్టుకొని పెట్టుబడిదారులు మరియు డెవలపర్లు ముందుకు వస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ విలువ ప్రకారం ఆ ప్రాంతంలో భూమి ధరలు తక్కువగా ఉన్నాయి. అక్కడ భూముల రిజిస్ట్రేషన్ ల వలన వచ్చే ఆదాయం కూడా తక్కువగానే ఉందని తెలుస్తుంది. తాజాగా ప్రభుత్వం అక్కడ మార్కెట్ రేట్లను పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now