State Bank Of India: మనదేశంలో ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకులలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఒకటి. ఈ బ్యాంకులో కోట్లాదిమందికి పొదుపు ఖాతాలు ఉన్నాయి. అయితే చాలామంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న వివిధ రకాల పథకాలలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తారు. పోస్ట్ ఆఫీస్ తర్వాత ప్రజలు ఎక్కువగా పెట్టుబడి పెట్టేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పథకాలలో. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎప్పటికప్పుడు తన కస్టమర్లకు మంచి వడ్డీ రేటు తో రకరకాల పెట్టుబడుల పథకాలను అందిస్తూ ఉంటుంది. రీసెంట్ గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లకు సంబంధించి ఒక కీలకమైన తీసుకున్నట్లు ప్రకటించింది.
కస్టమర్లకు ఇటీవలే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. ఎస్బిఐ బ్యాంకులో వివిధ కాల పరిమితులలో మూడు కోట్ల వరకు ఉన్న రిటైల్ టర్మ్ డిపాజిట్లపై 25 బేసిస్ పాయింట్లు వడ్డీ రేట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త రేట్లు జూన్ 15 నుంచి అమలులోకి రానున్నాయి. అలాగే పొదుపు ఖాతాల రేటును కూడా ఆల్ టైం కనిష్టస్థాయికి 2.5 శాతానికి తగ్గించినట్లు ప్రకటించింది. కొత్త పునరుద్ధరణ డిపాజిట్లను కూడా ఈ
తగ్గింపులో ప్రభావితం చేస్తాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నెల ప్రారంభంలో రేపో రేట్లు 50 బేసిక్స్ పాయింట్లు తగ్గించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిపుణులు చెప్తున్నారు. బ్యాంకు లాభాల మార్జిన్ లను కాపాడడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేస్తున్నారు. దాదాపు 45 శాతం రేపో రేటుతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన రూ.36 లక్షల కోట్ల రుణం పోర్ట్పోలియో ముడిపరి ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇందులో రూ.1.2 లక్షల కోట్ల వాహన రుణాలు అలాగే రూ.8.3 లక్షల కోట్ల గృహ రుణాలు ఉన్నట్లు తెలుస్తుంది.