Post Office Scheme: పోస్ట్ ఆఫీసులో ఉన్న పథకాలు ప్రభుత్వ హామీతో ఉన్న పథకాలు కాబట్టి వీటిలో రిస్క్ ఉండదు. పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న రికరింగ్ డిపాజిట్ పథకంలో మీ డబ్బులు సురక్షితంగా ఉంటాయి. అలాగే మెచ్యూరిటీ సమయానికి గ్యారెంటీగా ఇచ్చిన హామీ మెరకు డబ్బులు చేతికి అందుతాయి. ప్రతి ఒక్కరు కూడా తమకు వస్తున్న ఆదాయంలో కొంత పొదుపు చేసి వాటిని సురక్షితమైన పెట్టుబడి పథకంలో పెట్టుబడి పెట్టాలని భావిస్తారు. మీ డబ్బులు సురక్షితంగా మరియు ఖచ్చితంగా భారీ రిటర్న్స్ పొందాలంటే మీరు పోస్ట్ ఆఫీస్ లో ఉన్న రికరింగ్ డిపాజిట్ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. పోస్ట్ ఆఫీస్ లో ఉన్న రికరింగ్ డిపాజిట్ పథకంలో మీరు కేవలం రోజుకు రూ.333 పెట్టుబడి పెట్టడం వలన 16 లక్షల వరకు రిటర్న్స్ పొందవచ్చు.
ముఖ్యంగా ఈ పథకం మధ్యతరగతి మరియు సామాన్య ప్రజలకు చాలా మంచి పెట్టుబడి ఆప్షన్ గా చెప్పవచ్చు. ప్రతిరోజు కూడా చిన్న మొత్తాలను ఆదా చేయడం ద్వారా దీర్ఘకాలంలో 10 ఏళ్లలో 16 లక్షల మొత్తాన్ని సొంతం చేసుకోవచ్చు. అనేక రకాల చిన్నచిన్న పొదుపు పథకాలు సామాన్య ప్రజల కోసం పోస్ట్ ఆఫీస్ లో అందుబాటులో ఉన్నాయి. రికరింగ్ డిపాజిట్ పథకానికి ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి ఆకర్షనీయమైన వడ్డీని అందిస్తుంది. మీరు నెలకు కేవలం 100 రూపాయలతో రికరింగ్ డిపాజిట్ పథకంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు.
అలాగే వ్యక్తిగతంగా లేదా జాయింట్ ఖాతాను కూడా ఓపెన్ చేయవచ్చు. ప్రభుత్వం ఈ పథకంపై ప్రస్తుతం 6.7% వడ్డీ రేటును అందిస్తుంది. దీంట్లో కాంపౌండ్ వడ్డీ ఉంటుంది. జనవరి 1, 2024 నుంచి రికరింగ్ డిపాజిట్ కొత్త వడ్డీ రేటు అమలులోకి వచ్చింది. పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న అన్ని పొదుపు పథకాలు కూడా రిస్క్ లేకుండా సురక్షితమైన రిటర్న్స్ అందిస్తాయి. ప్రభుత్వ హామీతో ఉన్న పోస్ట్ ఆఫీస్ పథకాలలో పెట్టుబడి పెట్టడానికి చాలామంది ఆసక్తి చూపిస్తారు.