Pancha bootha : హిందువులు శివుణ్ణి పవిత్రంగా పూజిస్తారు. కొందరు ఇలవేల్పుగా కూడా నిలుపుకుంటారు. శివరాత్రి పండుగను పురస్కరించుకొని శివ పార్వతులకు కళ్యాణం నిర్వహిస్తారు. ఇలా ఒక్కో ప్రాంతంలో శివుణ్ణి పేరుపెట్టి పిలుస్తారు. కానీ శివునికి పంచ బూత స్థలాలు అనే పేరు కూడా ఉంది. పృథ్వి లింగం, జల లింగం, అగ్ని లింగం, వాయు లింగం, ఆకాశ లింగం దేవాలయాలను హిందూ కుటుంబాలు పంచ భూత స్థలాలు అంటారు. అవి ఎక్కడ ఉన్నాయో, వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం……
తిల్లై నటరాజ ఆలయం : ఈ ఆలయంలో ఆకాశ లింగన్ని దర్శించుకొంటారు. ఈ ఆలయం చిదంబరం పట్టణంలో ఉంది. ఆధ్యాత్మిక
ఆనందం కోసం, శివుని నృత్య రూపం చూడటానికి ఇక్కడకి వస్తారు.
కాచీపురం లో ఏకాంబరేశ్వర ఆలయం ఉంది. దీన్ని ‘పృథ్వి లింగం’ అంటారు. కాంచీపురంలోనే అతిపెద్ద ఆలయం. ఇక్కడే కామాక్షి అమ్మవారి ఆలయం కూడా ఉంది. కోరిన కోరికలు తీరిన భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.
శ్రీ కాళహస్తిలో ఉన్న శివాలయంను వాయు లింగంగా భావిస్తారు. ఇక్కడి శివ లింగం గాలిని ప్రతిబింబిస్తుంది. ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం. ఇక్కడే భక్త కన్నప్ప ఆలయం కూడా ప్రసిద్ధి చెందినది.
జంబుకేశ్వరర్ ఆలయంలో ఉన్న శివ లింగాన్ని జల లింగం అంటారు. ఈ లింగం నీటిని సూచిస్తుంది. కావేరి నది చుట్టూ ఉన్న ఒక ద్వీపంలో ఈ ఆలయం ఉంది. అందుకనే ఈ శివలింగాన్ని జల లింగం అని పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది.
అరుణాచలంలో ఉన్న ఆలయాన్ని అగ్ని లింగం అంటారు. అరుణాచలం పట్టణంలోని పర్వతం దిగువ భాగాన ఉంది. ఇక్కడ రమణ మహర్షి ఆశ్రమం కూడా ఉంది.