Jagtial: మెట్ పల్లి/జగిత్యాల, జూన్18 (ప్రజా శంఖారావం):ఇజ్రాయెల్ – ఇరాన్ దేశాల మధ్య భీకర యుద్ధం జరుగుతున్న ప్రదేశంలో ఇజ్రాయెల్లో జగిత్యాల పట్టణానికి చెందిన రేవెల్ల రవీందర్ మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. బతుకుదెరువు కోసం ఇజ్రాయెల్ వెళ్లిన రవీందర్ ఆ దేశంలో జరుగుతున్న యుద్ద బాంబుల చప్పుడుకి గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. మృతి చెందిన సమాచారం కుటుంబ సభ్యులకు అందటంతో మృతుడి ఇంటి వద్ద కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు రోదిస్తున్నారు. మృత దేహాన్ని స్వస్థలానికి త్వరగా తీసుకురావాలని ప్రభుత్వాన్ని కుటుంబ సభ్యులు, బందువులు కోరుతున్నారు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి
Join WhatsApp Group
Join Now