ACB RIDES: కరీంనగర్ జిల్లా, జూన్ 17 (ప్రజా శంఖారావం); కరీంనగర్ జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు కలకలం రేపాయి. పంచాయతీరాజ్ ఏఈ శరత్, సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్ లు లంచం డబ్బులు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. బాధితుని నుండి వెహికల్ బిల్లు చెల్లింపు విషయంలో 8 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. వారిని ఏసీబి కోర్టులో హాజరు పరుస్తామని చెప్పారు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి
Join WhatsApp Group
Join Now