Ayushman Card: 70 ఏళ్ళు వయస్సు పైబడిన వారికి కేంద్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్త చెప్పింది. వీళ్ళందరికీ ఆయుష్మాన్ భారత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం హెల్త్ కార్డులను అందిస్తుంది. ఈ కార్డును ఉపయోగించి సీనియర్ సిటిజన్స్ ఒక ఏడాదికి ఐదు లక్షల రూపాయల వరకు ఉచితంగా మెడికల్ ట్రీట్మెంట్ పొందవచ్చు. ఆయుష్మాన్ భారత్ లో ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం కింద సీనియర్ సిటిజన్స్ ఆయుష్మాన్ వై వందన కార్డును పొందవచ్చు. ఈ కార్డును వాళ్ళు ఇంటి నుంచే ఆయుష్మాన్ యాప్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
ఆయుష్మాన్ భారత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 70 ఏళ్ళు వయసు పైబడిన వారికి అందిస్తున్న కార్డును ఆయుష్మాన్ వే వందన కార్డు అంటారు. సంపాదనతో అవసరం లేకుండా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆసుపత్రులలో ఒక ఏడాదికి ఈ కార్డు ఉన్నవారు 5 లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంట్ పొందవచ్చు. మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2018లో ఈ పథకాన్ని మొదలుపెట్టారు. ఇప్పటివరకు ఇది 55 కోట్లకు పైగా ఉన్న ప్రజలలో 40 శాతం వరకు కవర్ చేస్తుంది.
ఆదాయంతో సంబంధం లేకుండా అక్టోబర్ 29, 2024 నాటికి 70 ఏళ్లు పైబడిన వయసు ఉన్న పౌరులందరూ కూడా ఈ కార్డు కు అర్హులు. ఇప్పటివరకు గణాంకాల ప్రకారం 65,97,096 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. అందులో 64,96,101 దరఖాస్తులు అప్రూవ్ కూడా అయ్యాయి. ఇంకా 96,203 కార్డులు పెండింగ్ లో ఉన్నాయి.4,792 దరఖాస్తులు కొన్ని కారణాల వలన రిజెక్ట్ అయ్యాయి. అలాగే ఇప్పటివరకు 434 ఆయుష్మాన్ కార్డులు పంపిణీ కూడా అయ్యాయి. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కేరళ, గుజరాత్ మరియు చత్తీస్ ఘడ్ రాష్ట్రాల నుంచి అత్యధిక దరఖాస్తులు వచ్చాయి.