Rajeev Swagruha: రాజీవ్ స్వగృహ ఇళ్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేలం పాట పాడేందుకు రెడీగా ఉన్నట్లు గత కొన్ని రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఈనెల 20వ తేదీన దీనికి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఇప్పటికే దీనికి సంబంధించి కొన్ని కీలక పనులను వదిలిపెట్టినట్లు సమాచారం. ఈ మేరకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ హైదరాబాద్ నగరంలో ఉన్న బండ్లగూడ తోపాటు గాజులరామారం పోచారం, ఖమ్మం జిల్లాలో ఉన్న పోలేపల్లి లో రాజీవ్ స్వగృహ ప్లాట్లను విక్రయించేందుకు నిర్ణయం తీసుకుంది.కాంగ్రెస్ ప్రభుత్వం 2007లో ఉద్యోగులు మరియు వ్యాపారస్తులు వంటి మధ్యతరగతి కుటుంబాల కోసం హైదరాబాద్ నగరంలో ఈ ఇళ్లను నిర్మించింది.
టవర్ల రూపంలో ఈ ఇళ్ల నిర్మాణం జరిగింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఈ ఇళ్లను టవర్ల రూపంలో లేదా ప్లాట్ల రూపంలో వేలంపాటలో విక్రయిస్తారా అనే సందేహం అందరిలో ఉంది. ఒకవేళ ఈ ఇళ్లను తెలంగాణ ప్రభుత్వం టవర్ల రూపంలో వేలంపాటలో విక్రయించినట్లయితే వీటిని హౌసింగ్ సొసైటీలో కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ క్రమంలో అతి తక్కువ ధరకు మీరు ఇళ్లను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్ళను అందించడం ద్వారా భారీ ఊరట కల్పిస్తుంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ స్వగృహ ఇళ్లను విక్రయించడం వలన 3000 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి లభిస్తుంది అని అంచనా వేయడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న హౌసింగ్ బోర్డు ప్లాట్లు స్థలాలను కూడా వేలంపాటలు విక్రయించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూకట్పల్లి హౌసింగ్ బోర్డు లో ఉన్న ఖాళీ స్థలాలను విక్రయించే రికార్డు స్థాయిలో ఆదాయం అందుకుంది. కూకట్పల్లిలో ఒక్కో గజం 3 లక్షల రూపాయలకు అమ్ముడు అయ్యింది.