Congress: మంత్రులకు టీపీసీసీ మాస్ వార్నింగ్.. హద్దులు దాటరాదు

Congress
Congress

Congress: తెలంగాణ రాష్ట్రంలోని ఇద్దరు మంత్రులు కాస్త దూకుడు పెంచారు. తెలిసి మాట్లాడారా ? తెలియక మాట్లాడారా ? లేదంటే అవగాహన లేకుండానే మాట్లాడారా ? ఎలా మాట్లాడిన ఆ ఇద్దరు మాట్లాడిన మాటలు మాత్రం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో మాత్రం ప్రకంపనలు సృష్టించాయి. పది మందిలో నోరు జారిన వ్యక్తి, యుద్ధంలో ఆయుధం వదిలేసిన వ్యక్తి ఒక్కరే అంటారు. ఇప్పడు రాష్ట్రంలోని ఇద్దరు వ్యక్తులు కూడా నోరు జారారు. పీసీసీ కి కోపం తెప్పించారు.

మంత్రి వర్గ సమావేశంలో ఎజెండా ప్రకారం చర్చించకుండానే స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఎలా మాట్లాడుతారు అంటూ ఇద్దరు మంత్రులపై పీసీసీ అసంతృప్తిని వ్యక్తం చేసింది. కోర్ట్ లో ఉన్న విషయం గురించి ముందే స్పందించడం సరికాదంటూ సుతిమెత్తగా హెచ్చరించింది. మాట్లాడటంలో తప్పు లేదు. కానీ ముందుగా పార్టీని సంప్రదించండి. లేదంటే మాట్లాడే విషయం గురించి స్పష్టంగా తెలుసుకున్న తరువాతనే మాట్లాడాలంటూ హితబోధ చేసింది రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు.

కోర్ట్ పరిధిలో ఉన్న అంశాలపై జాగ్రత్తగా మాట్లాడాలి. అంతే కాదు ఒకరి శాఖ విషయంలో మరొకరు జోక్యం చేసుకుంటే ఎలా అంటూ కూడా రాష్ట్ర పీసీసీ మంత్రులని ప్రశ్నించింది. ఒకరి బాధ్యతల్లో మరొకరు జోక్యం చేసుకోకండి. ఆలా అయితే ప్రతిపక్షాలకు చులకన అవుతాం అంటూ పీసీసీ ఇద్దరు మంత్రులకు తలంటింది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now