Gaddar Awards: గద్దర్ అవార్డుతో తెలుగు చిత్ర పరిశ్రమ కళకళ

Gaddar Awards
Gaddar Awards

Gaddar Awards: గద్దర్ అవార్డుతో తెలుగు చిత్ర పరిశ్రమ కళకళ

తెలుగు చిత్ర పరిశ్రమ సుమారు పదేళ్ల నుంచి ఎలాంటి అవార్డు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నోచుకోలేదు. ఉమ్మడి రాష్ట్రంలోనే సినీ కళాకారులకు అవార్డులు అందాయి. ప్రత్యేక రాష్ట్రము ఏర్పడిన అనంతరం పరిశ్రమకు అవార్డుల ఉత్సవం కంటికి కనబడనంత అయ్యింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం భాద్యతలు చేపట్టింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి భాద్యతలు చేపట్టిన వెంటనే తెలుగు చిత్ర పరిశ్రమ భాద్యతలను దిల్ రాజు పై పెట్టారు. ఆయన భాద్యతలు చేపట్టిన తరువాతనే అవార్డుల ఎంపికకు కదలిక వచ్చింది.

దిల్ రాజు తో పాటు నటులు మురళీమోహన్, జయసుధ లతో అవార్డుల ఎంపిక భాద్యతలను తీసుకున్నారు. శనివారం సాయంత్రం ఈ అవార్డులను సినీ కళాకారులకు ప్రభుత్వం అందజేయనుంది. ఈ కార్యక్రమానికి చిత్ర పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరిని రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ప్రముఖ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి హేమాహేమీలు రాబోతున్నారు. షూటింగ్ వదులుకొని అల్లు అర్జున్, సుకుమార్ కూడా విదేశాల నుంచి తరలిరావడం విశేషం. సినీ దిగ్గజాలందరిని అవార్డు కమిటీ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు.

గత కొన్నేళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమకు అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నవి. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి భాద్యతలు చేపట్టిన తరువాతనే పదేళ్ల అనంతరం కొత్త దనం కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి పరిశ్రమకు వరాలు కురిపించే అవకాశాలు సైతం కనబడుతున్నవి. గద్దర్ అవార్డుల కార్యక్రమంతో తెలుగు చిత్ర పరిశ్రమ కళకళలాడుతోంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now