Mahalakshmi Scheme: త్వరలో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఆర్థికంగా భరోసా కల్పించేందుకు తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలలో భాగంగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలకు ప్రతినెల రూ.2500 రూపాయలు ఆర్థిక సహాయం అందించేందుకు మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. త్వరలో మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించడానికి తెలంగాణ ప్రభుత్వం చాలా వేగంగా సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ప్రతి ఏడాది రూ.30 వేల రూపాయలు ఆర్థిక భరోసా అందం ఉంది. అయితే మహాలక్ష్మి పథకం కింద తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి 55 ఏళ్లలోపు వయస్సు ఉన్న మహిళలు దీనికి అర్హులు. ఇప్పటి వరకు ఎటువంటి పింఛన్స్ సౌకర్యం లేని మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల రూ.2500 ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఆర్థిక సహాయం అందించేందుకు పూర్తి సన్నాహాలు చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికలు సమీపిస్తుండడంతో ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను వేగంగా పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తుంది.
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఈ పథకాన్ని అమలు చేసినట్లయితే రాష్ట్రంలో ఉన్న ప్రజల మద్దతు పూర్తిస్థాయిలో అందుతుంది అని ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలకు శుభవార్త చెప్తారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన మహిళలకు ప్రతినెలా రూ.2500 నగదును వారి బ్యాంకు ఖాతాలో జమ చేసి వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు రెడీ అవుతుంది.