Telangana: ఆ రాష్ట్ర మహిళలకు గొప్ప అవకాశం..ఉచిత శిక్షణ.. ఆ తర్వాత ఉద్యోగం

Telangana
Telangana

Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఆర్టీసీ సంస్థలో అద్దె ప్రాతిపదికన బస్సులను నడిపించడానికి ఉత్తర్వులు ఇచ్చింది. అదే విదంగా పెట్రోల్ బంక్ లను కూడా మహిళలకే మంజూరు చేస్తోంది. సోలార్ ప్లాంట్ లను కూడా మంజూరు చేస్తోంది. వీటి ద్వారా వచ్చే ఆదాయంతో మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడానికి అవకాశం ఉంది. తాజాగా స్వరూప అనే మహిళ డ్రైవర్ గా ఆర్టీసీ సంస్థలో నియామకం అయ్యింది.

స్వరూపను స్ఫూర్తిగా తీసుకోని రాష్ట్రంలో ఆసక్తి ఉన్న మహిళలను ఎంపిక చేసి డ్రైవింగ్ లో శిక్షణ ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. శిక్షణ ఉచితంగా అందజేయడానికి సంబంధిత మంత్రులు కూడా చర్యలు చేపట్టారు. శిక్షణకు ఎంపికయిన మహిళలకు ఉచితంగా ప్రభుత్వమే శిక్షణ ఇవ్వనుంది. అన్ని వసతులతో శిక్షణ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైనది.

శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ ప్రభుత్వ పరంగా అందజేస్తారు. అనంతరం ముందుగా ఆర్టీసీ లో ఉన్న అవకాశాల మేరకు శిక్షణ పొందిన వారితోడ్రైవర్ గా భర్తీ చేస్తారు. మిగిలిన వారిని రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో డ్రైవర్ గా నియమిస్తారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now