Kubera: జూన్ నెల 20వ తేదీన ధనుష్, రష్మిక మందన, నాగార్జున ప్రధాన పాత్రలలో నటించిన కుబేర సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా మేకర్స్ యూఏ సర్టిఫికెట్ పొందడం కోసం సినిమాలో ఏకంగా 13 నిమిషాల నిడివిని కూడా కోల్పోవడానికి ఓకే చెప్పారని సమాచారం. కుబేర సినిమాలో నాగార్జున కీలకపాత్రలో కనిపించారు. ధనుష్, రష్మిక మందన జోడిగా నటించిన కుబేర సినిమా ఈనెల 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది. చాలా రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.
శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన మన సెన్సార్ సర్టిఫికెట్ లో శేఖర్ కమ్ముల కుబేరగా పేర్కొన్నారు. గతంలో సెన్సార్ కు ఈ సినిమా అప్లై చేసినప్పుడు ఈ సినిమా మొత్తం నిడివి 195.25 నిమిషాలు. కానీ ప్రస్తుతం కుబేర సినిమా సెన్సార్ కత్తెరపు పదును పెట్టడంతో అందులో దాదాపు 13 నిమిషాల నిడివిని తొలగించాల్సి వచ్చింది. ఇక కుబేర సినిమాలో ఏకంగా మూడు నిమిషాల సన్నివేశాలకు సెన్సార్ బోర్డు వాళ్ళు అభ్యంతరం తెలిపినట్లు తెలుస్తుంది. సెన్సార్ పరిశీలించిన తర్వాత ప్రస్తుతం కుబేర సినిమా 181.46 నిమిషాలకు కుదించబడింది. అయినా కూడా ఈ సినిమా మూడు గంటల పైన ఉన్నట్టు తెలుస్తుంది.
ఇక కుబేర సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతున్న మరొక సినిమా కన్నప్ప. కన్నప్ప సినిమా నిడివి కూడా మూడు గంటలకు పైగా ఉన్నట్లు సమాచారం. ఇక కుబేర సినిమాలో సినిమా కథాంశం మొత్తం చిత్రవిచిత్రమైన మలుపులతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది అని తెలుస్తుంది. ఈ సినిమాలో అత్యంత ధనవంతుడు, అలాగే రోడ్డుమీద అడుక్కునేవాడు మధ్యలో మాత్రం నడ మంత్రపు సిరి పొందిన ఒక వ్యక్తి. ఈ మూడు పాత్రల మధ్య చాలా ఆసక్తికరంగా సినిమా మొత్తం సాగుతుంది అని తెలుస్తుంది. ఒక బిచ్చగాడు భారత ప్రభుత్వాన్ని సవాల్ చేయడం అనే అంశంతో ఈ చిత్ర కథాంశం ఉంటుంది అని అంటున్నారు.