Local Elections: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం క్యాబినెట్ సమావేశం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి పలు కీలకమైన అంశాల గురించి మంత్రి మండలితో ఈ సమావేశంలో చర్చించారు. క్యాబినెట్ ఈనెల చివరిలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. వర్షాకాలం కారణంగా జూన్ లేదా జూలైలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్య అసాధ్యాలపై మంత్రి మండలితో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి 300 పేజీలతో ఉన్న ఎన్ డి ఎస్ ఏ రిపోర్ట్ అలాగే 150 పేజీలతో ఉన్న విజిలెన్స్ రిపోర్ట్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ని అందించారు.
ఈ రిపోర్టుపై మంత్రుల అభిప్రాయాలను సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. క్యాబినెట్ తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి పలు జిల్లాలలో ఉన్న ప్రభుత్వ భూములను టీజీఐసీసీకి బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రిమండలి దీనికి సంబంధించి స్పెషల్ ఎక్సైజ్ అమలు చేయాలని కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. క్యాబినెట్ మరో డైరెక్టర్ ను విద్యాశాఖలో నియమాకం చేయాలని కూడా నిర్ణయం తీసుకుంది. 300 పోస్టుల క్రియేషన్ కి విద్యా శాఖలో అనుమతి తెలిపింది. తెలంగాణ క్యాబినెట్ ఉద్యోగుల డిమాండ్లపై సుదీర్ఘంగా మంత్రి మండలితో చర్చించింది.
ఈ సమావేశంలో అధికారుల కమిటీ నివేదికపై కూడా ప్రస్తావించారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డీఏ, ఆరోగ్య భద్రత తో పాటు పెండింగ్లో ఉన్న బిల్లుల గురించి కూడా చర్చించారు. ప్రతినెల ఉద్యోగులకు రూ.700 కోట్లతో పెండింగ్ బిల్లులు చెల్లించాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే క్యాబినెట్ రూ.23 వేల కోట్ల రోడ్ల నిర్మాణానికి కూడా ఆమోదం తెలిపింది. జహీరాబాద్ ఇండస్ట్రియల్ అథారిటీ ఏర్పాటు చేయడానికి కూడా క్యాబినెట్ అనుమతి ఇచ్చింది. మహిళా సంఘాలకు సంబంధించిన భీమానిధుల ను రిలీజ్ చేసేందుకు కూడా ఒకే చెప్పింది.