Megastar: డెహ్రాడూన్ వెళ్లిన మెగాస్టార్
పెట్టుబడి దారులకు చిరంజీవి సినిమాపై ఎంతో నమ్మకం ఉంటుంది. పెట్టిన పెట్టుబడి తో పాటు అధిక లాభాలు కూడా వస్తాయనే నమ్మకం నిర్మాతల్లో ఉన్నది. అందుకే ఆయన కాళీ సమయం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తుంటారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 157 ప్రాజెక్ట్ శరవేగంగా నిర్మాణమవుతోంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అభిమానులు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు.
157 ప్రాజెక్ట్ సినిమా చిత్ర బృందం అంతా కలిసి డెహ్రాడూన్ వెళ్లారు. రెండో ఎపిసోడ్ భాగాన్ని అక్కడే చిత్రీకరిస్తున్నారు. మెగాస్టార్ కూడా చిత్ర బృందంతో కలిసే వెళ్లారు. మిగిలిన కొన్ని సన్నివేశాలను అక్కడే పూర్తి చేసుకొని రానున్నారు. చిరంజీవి తో తీయాల్సిన సన్నివేశాలను కూడా అక్కడే చేస్తున్నారు. అందుకే చిరంజీవి కూడా డెహ్రాడూన్ వెళ్లారు. ఇప్పుడు చిరంజీవి తో పాటు హీరోయిన్ నయనతార కూడా డెహ్రాడూన్ లోనే ఉన్నారు. వీరిద్దరిపై తీయాల్సిన మరొక పాటను అక్కడే తీయడానికి సన్నాహాలు చేస్తోంది చిత్ర బృందం.
సినిమాలో ప్రధాన అంశం ఒకతీరు ఉండగా, హాస్యపు సన్నివేశాలు మరొక భాగంగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. అనిలా రావిపూడి ” సంక్రాంతికి వస్తున్నాం ” సినిమా విజయ వంతం కావడంతో మంచి జోరు మీద ఉన్నారు. చిరంజీవి 157 ప్రాజెక్ట్ విజయవంతమైతే తనకు ఇక తిరుగులేదనే భావంలో ఉన్నాడు రావిపూడి. మెగా 157 సినిమాను అభిమానుల ముందుకు సంక్రాంతి పండుగకు కానుకగా ఇవ్వబోతున్నారు.