Post Office Scheme: చాలామంది ఎటువంటి రిస్క్ లేకుండా స్థిరమైన నెలవారి ఆదాయం పొందే పథకాలలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి వారికి పోస్ట్ ఆఫీస్ లో ఉన్న మంత్లీ ఇన్కమ్ స్కీమ్ చాలా బెటర్. ఈ మధ్యకాలంలో ఈ స్కీము ఆకర్షణీయమైన ఎంపికగా మారుతుంది. ఇందులో మీ డబ్బుకు భద్రతతో పాటు మీకు ప్రతి నెల స్థిరమైన ఆదాయం కూడా లభిస్తుంది. పదవి విరమణ తర్వాత ప్రతినెల ఖర్చులకోసం స్థిరమైన ఆదాయం పొందాలని భావిస్తున్న సీనియర్ సిటిజన్స్ కి కూడా మంత్లీ ఇన్కమ్ స్కీమ్ చాలా ప్రయోజనకరంగా ఉంది. ఇదే ఐదేళ్ల మెచ్యూరిటీ కాలంలో ఉంటుంది. ఒకేసారి పెద్ద మొత్తంలో మంత్లీ ఇన్కమ్ స్కీమ్ పథకంలో ఇన్వెస్ట్ చేయాలి.
నెలనెలా పెట్టుబడి అవకాశం ఈ పథకంలో లేదు. ఐదేళ్లపాటు మీరు ఒకేసారి ఇందులో ఇన్వెస్ట్ చేసినట్లయితే మెచ్యూరిటీ అయ్యే వరకు నెల నెల ఆదాయం వస్తుంది. పోస్ట్ ఆఫీస్ లో ఈ పథకం కోసం ఖాతాను వ్యక్తిగతంగా ఓపెన్ చేయవచ్చు లేదా ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కలిసి ఉమ్మడిగా కూడా ఖాతాను ఓపెన్ చేయవచ్చు. పది ఏళ్ళు నిండిన పిల్లల పైన కూడా వాళ్ల తల్లిదండ్రులు లేదా సంరక్షకులు కూడా ఖాతాను ఓపెన్ చేయవచ్చు. కేవలం రూ.1000 రూపాయలతో మీరు పోస్ట్ ఆఫీస్ లో ఉన్న ఈ పథకంలో ఖాతా ఓపెన్ చేయవచ్చు.
గరిష్టంగా ఇందులో మీరు వ్యక్తిగతంగా రూ.9 లక్షల వరకు అదే ఉమ్మడి ఖాతాలో అయితే గరిష్టంగా రూ.15 లక్షల వరకు పెట్టుబడి చేసుకోవచ్చు. ఇందులో మీకు 7.4% వడ్డీ రేటు అందిస్తున్నారు. ఉదాహరణకు మీరు పోస్ట్ ఆఫీస్ లో ఉన్న మంత్లీ ఇన్కమ్ స్కీమ్ పథకంలో ఉమ్మడి ఖాతా ఓపెన్ చేసి అందులో మీరు గరిష్టంగా రూ.15 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లయితే మీకు 7.4% వడ్డీ రేటు ప్రకారము ప్రతినెల ఖాతాలో రూ.9,250 జమ చేయబడుతుంది.