Operation Sindoor: పాకిస్తాన్ కు చావు దెబ్బ.. భారత్ కీలక నిర్ణయం..
పాకిస్తాన్ ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది. ఇండియా తో యుద్ధం చేయడానికి కూడా సరిపడేంత ఆర్థిక వనరులు లేవు. భారత్ తో యుద్దానికి తలపెడితే తట్టుకోలేమని కూడా పాకిస్తాన్ కు తెలుసు. అయినప్పటికీ ఉగ్రవాదులపై ఆధారపడి పాకిస్తాన్ కయ్యానికి కాలు దువ్వుతోంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఇండియా దాడి చేయడంతో పాకిస్తాన్ ఎంత నష్ట పోవాలో అంత కంటే ఎక్కువగానే నష్ట పోయింది. ఈ నేపథ్యంలో ఇండియా పాకిస్తాన్ పై కఠినమైన ఆంక్షలు విధించింది. సిందూ జలాల ఒప్పందాన్ని నిలిపి వేసి పాకిస్తాన్ ను ఇబ్బందుల్లోకి నెట్టింది.
భారత్ జమ్మూకాశ్మీర్ లో జలవిద్యుత్ ప్రాజెక్ట్ లను నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్ లకి సింధు జలననే ఉపయోగిస్తోంది. పాకిస్తాన్ కు ఇవ్వాల్సిన నీటి తో ఇప్పుడు భారత్ అదనంగా జలవిద్యుత్ ను ఉత్పత్తి చేస్తోంది. గతంలో నిర్మించిన ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నవి. మరి కొన్ని జల విద్యుత్ ప్రాజెక్ట్ లు నిర్మాణంలో ఉన్నవి. ఈ ప్రాజెక్టులన్నీ కూడా సిందూ జలాలపైననే ఆధారపడి ఉన్నవి. ఈ జలాలను పాకిస్తానుకు వెళ్లకుండా అడ్డు కట్ట వేయడంతో జమ్మూ కాశ్మీర్ లో ఇప్పుడు అదనపు విద్యుత్ తయారవడానికి అవకాశాలు ఉన్నవి. అదే విదంగా పాకిస్తాన్ కు వెళ్లాల్సిన సిందూ జలాలు నిలిచి పోవడంతో అక్కడి భూములన్నీ కూడా ఎడారిగా మారడం తప్పదు.
కేంద్ర విద్యుత్ అథారిటీ ఆధ్వర్యంలో నాలుగు హైడ్రో ప్రాజెక్టులు నిర్మాణానికి సిద్ధంగా ఉన్నవి. ఈ ప్రాజెక్టులన్నీ కూడా సిందూ జలాలపైననే ఆధారపడి ఉన్నవి. అదే విదంగా జమ్మూ కాశ్మీర్లో మరో తొమ్మిది హైడ్రో ప్రాజెక్టులను కూడా సిందూ జలాల ఆధారంతోనే నిర్మించడానికి సిద్ధమవుతోంది. ఈ తొమ్మిది ప్రోజెక్టుల ద్వారా 1,008 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
సిందూ జలాల ను సద్వినియోగం చేసుకొని జమ్మూ కాశ్మీర్ లో తొమ్మది ప్రాజెక్టులను నిర్మిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఆ జలాలన్నింటిని సద్వినియోగం చేసుకోవడంతో పాకిస్తాన్ పీకల్లోతూ ఆర్థిక నష్టాల్లోకి వెళ్ళక తప్పదు.