Korutla: మెట్ పల్లి/కోరుట్ల, జూన్15 (ప్రజా శంఖారావం): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో భారీ వినాయక విగ్రహాల తరలింపులో విద్యుత్ షాక్ తగిలి పలువురికి తీవ్ర గాయాలు కాగా పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా, నలుగురు పరిస్థితి విషమించడంతో చికిత్స కోసం జగిత్యాల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల శివారులోని కోరుట్ల బాలాజీ గణపతి విగ్రహాల తయారీ కేంద్రంలో జరిగింది.
33కేవీ విద్యుత్ తీగలు వినాయక విగ్రహనికి తగిలి 9 మందికి విద్యుత్ షాక్ కు గురి కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కోరుట్ల గణేష్ విగ్రహాల తయారీ కేంద్రంలో కరెంట్ షాక్ లో గాయపడిన వారు 1) అల్వాల వినోద్ s/o లక్ష్మణ్ 2) అల్వాల నితిన్ s/o లక్ష్మణ్ 3) వెంకట్ రెడ్డి రాజేష్ s/o శంకర్ 4) నెల్లుట్ల బంటి s/o హనుమంతు r/o అర్బన్ కాలనీ కోరుట్ల 5) నెల్లుట్ల కృష్ణ s/o హనుమంతు r/o అర్బన్ కాలనీ కోరుట్ల 6) సాయినాథ్ MH 7) హనుమంతు MH 8) ఆకాష్ UP 9) రోషన్ UP లుగా గుర్తించారు. బతుకు తెరువు కోసం ఇతర రాష్ట్రాల నుండి గణేష్ విగ్రహాల తయారీ కోసం ఇక్కడికి వచ్చి విగ్రహాలను తయారు చేస్తున్నట్లు చెబుతున్నారు.