TGSRTC: ఆర్టీసీలో ఫస్ట్.. మహిళా డ్రైవర్ ఆమె.. ”X” వేదికగా సీఎం రేవంత్ శుభాకాంక్షలు..
కాలం మారుతోంది. రాజకీయంగా మహిళలు రాణిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో 33 శాతం వాళ్ళే కనబడుతున్నారు. వ్యాపార రంగంలో ఉన్నారు. మోటార్ సైకిల్ నడుపుతున్నారు. కార్ కూడా మేము నడపగలం అంటూ నిరూపిస్తున్నారు. విమానం నడుపుతున్నారు. రైల్ నడుపుతున్నారు. కానీ యాబై మందికి పైగా ప్రయాణించే బస్సును రద్దీలో నడపడం కష్టమే అవుతుంది. కానీ నేను బస్సును నడపగలను అంటూ ఓ మహిళా ముందుకు రావడం విశేషం. ఆమె ధయిర్యానికి మెచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ లో బస్సు డ్రైవర్ గా నియామకం చేసింది. ఆమె రాష్ట్ర ఆర్టీసీ సంస్థలో తొలి మహిళా డ్రైవర్ కావడం విశేషం. వివరాలలోకి వెళితే..
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణ పురం మండలం సీత్య తండా కు చెందిన సరిత . ఈమె కొద్ది రోజుల పాటు కుటుంబ పోషణ కోసం ఢిల్లీ లో ప్రైవేట్ బస్సు డ్రైవర్ గా పనిచేసింది. ఇంటికి దూరమైనప్పటికీ అక్కడే విధులు నిర్వహించింది. కుటుంబ సభ్యులు అనారోగ్యంకు గురికావడంతో ఇంటికి వచ్చింది. ఉపాధి పరంగా ఆమెకు డ్రైవింగ్ ఒక్కటే అవకాశం. తప్పని సరి పరిస్థితుల్లో ఆమె డ్రైవర్ గా నే పని చేయాలి. ఈ నేపథ్యంలో ఆమె రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి లను కలిసి దరఖాస్తు చేసుకున్నది.
మంత్రులు స్పందించి డ్రైవర్ గా అవకాశం కల్పించారు. మొదటిసారి ఆమెకు హైదరాబాద్ నుంచి మిర్యాల గూడ వరకు బస్సు నడపడానికి ఆర్టీసీ సంస్థలో అవకాశం కల్పించారు. ఆమె ప్రతిభను గుర్తించిన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి తో పాటు పలువురు అభినందనలతో ముంచెత్తారు