Todays Gold Rate: పరుగులు పెడుతూ.. లక్ష మైలు రాయి దాటిన పసిడి..
పెరుగుతున్న బంగారం ధరలు అంతర్జాతీయ పరిణామాలపై అలాగే డాలర్ తో రూపాయి మారకం విలువ వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇజ్రాయిల్ మరియు ఇరాన్ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత కారణంగా ఈరోజు మన దేశంలో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. మన దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు తులం బంగారం ధరపై ఏకంగా రూ.2200 పెరిగే ప్రస్తుతం స్వచ్ఛమైన తులం బంగారం ధర రూ.1,01,560 గా ఉంది. ఇది రికార్డు స్థాయికి చాలా దగ్గరలో ఉంది అని చెప్పొచ్చు. ప్రస్తుతం దేశంలో పెళ్లిళ్ల సీజన్ జరుగుతున్న నేపథ్యంలో బంగారం ధరలు బుల్లెట్ వేగంతో రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రతిరోజు పన్ను మరియు ఎక్సైజ్ సుంకాల కారణంగా కూడా బంగారం మరియు వెండి ధరలలో హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి.
ఆల్ ఇండియా సరఫరా అసోసియేషన్ గణాంకాల ప్రకారం
ఈరోజు స్వచ్ఛమైన తులం బంగారం ధర రూ.1,14,100 గా ఉంది. ఇక 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.92,960 గా ఉంది. మన దేశంలో ఉన్న పలు ప్రధాన నగరాలలో ఈరోజు కిలో వెండి రూ.1,10,100 గా ఉంది. ఇక దేశంలో ఉన్న పలు ముఖ్యమైన నగరాలు చెన్నై, ముంబై, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం మరియు బెంగళూరు వంటి నగరాలలో ఈరోజు స్వచ్ఛమైన తులం బంగారం ధర రూ.1,01,410, 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.92,960 గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక మరియు రాజకీయ పరిస్థితులు సరిగ్గా లేకపోవడం కారణంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి అమెరికాలో పనులకు సంబంధించి కొత్త సమస్యలు మొదలైన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితులు కూడా పెట్టుబడిదారులను భయపెడుతున్నాయి. ఇటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లో పెట్టుబడి పెట్టాలని భావిస్తున్న వారు తమ డబ్బు సురక్షితంగా ఉండేలాగా పెట్టుబడి పెట్టాలని కోరుకుంటారు. చాలా ఏళ్ల నుంచి బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. ఈ క్రమంలో ప్రజలు బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేయడంతో మార్కెట్లో కూడా వీటి డిమాండ్ పెరిగి ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి.