Yellareddy: అర్ధరాత్రి ఆలయంలో చోరీ

Theft in the temple
Theft in the temple

Yellareddy: అర్ధరాత్రి ఆలయంలో చోరీ

ఎల్లారెడ్డి, జూన్ 15 (ప్రజా శంఖారావం): ఆలయంలో గుర్తుతెలియని దుండగులు చొరబడి చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని హాజీపూర్ తాండలోని జగదాంబ మాత, సేవాలాల్ ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. తాండ వాసులు తెలిపిన వివరాల ప్రకారం… హాజీపూర్ తాండలో ఉన్న జగదాంబ మాత, సేవాలాల్ ఆలయంలో పూజారి దుప్య నాయక్ రోజువారి లాగే పూజలు నిర్వహించి అనంతరం అలయానికి తాళం వేసి వెళ్లారు. కాగా అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ఆలయంలో ఉన్న హుండీ గొలుసుతో వేసిన తాళాన్ని విరగొట్టి ఆలయంలోకి చొరబడి సూమారు రూ.30వేలు నగదును అపహరించారు. సోమవారం ఉదయం ఆలయ పూజారి దుప్య నాయక్ వచ్చి చూడగా ఆలయంలో ఉన్న కనిపించకపోవడంతో తాండ వాసులు సమాచారం ఇచ్చారు. అనుమానం వచ్చి ఆలయంలో చుట్టూ పక్కల చూడగా ఆలయం పక్కన తాళాలు పగలగొట్టి ఉండడంతో అందులో నగదు కనిపించలేదు. దీంతో ఆలయంలో చోరీ జరిగిందని గమనించి గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు పోలీసులు క్లూస్ టీంకు సమాచారం ఇచ్చారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now