CREDIT CARD: క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చిన 2 బ్యాంకులు.. జులై 1 నుంచి కొత్త నియమాలు అమలు

CREDIT CARD
CREDIT CARD

CREDIT CARD: టెక్నాలజీ రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో బ్యాంకింగ్ రంగంలో లావాదేవీల విషయంలో కూడా అనేక కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. వివిధ బ్యాంకుల క్రెడిట్ కార్డుల ద్వారా చేసే లావాదేవీల సంఖ్య ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. ఉద్యోగం చేసే వాళ్ళు క్రెడిట్ కార్డులను వాడడం సర్వసాధారణం అయిపోయింది. రీసెంట్ గా రెండు బ్యాంకులు తమ క్రెడిట్ కార్డు కస్టమర్లకు ఒక షాకింగ్ న్యూస్ తెలిపాయి. క్రెడిట్ కార్డుకు సంబంధించి కొన్ని నియమాలు వచ్చే నెల నుంచి మారుతాయి అని రెండు బ్యాంకులు ప్రకటించాయి. భారతదేశంలో ఉన్న ప్రముఖ ప్రైవేట్ రంగా బ్యాంకులలో హెచ్డిఎఫ్సి మరియు ఐసిఐసిఐ బ్యాంకు లు కూడా ఒకటి.

ఈ రెండు బ్యాంకులు తమ బ్యాంకుల క్రెడిట్ కార్డు కస్టమర్లకు కొన్ని కీలక నియమాలను తెలిపాయి. జులై 1, 2025 నుంచి ఈ రెండు బ్యాంకుల క్రెడిట్ కార్డు నియమాలు మారుతాయి అని తాజాగా ప్రకటించాయి. ఆన్లైన్ గేమింగ్, వాలెట్ లోడ్ లు, బీమా లావాదేవీల పై రివార్డు పాయింట్లకు సంబంధించిన చార్జీలను హెచ్డిఎఫ్సి బ్యాంక్ సవరిస్తున్నట్లు తెలిపింది. హెచ్డిఎఫ్సి బ్యాంకు క్రెడిట్ కార్డును మీరు ఉపయోగించే విధానాన్ని ఈ నియమాలు ప్రభావితం చేసే అవకాశం ఉంది. మీరు ఒకవేళ పదివేల కంటే ఎక్కువగా ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫాములపై ఖర్చు చేస్తున్నట్లయితే మీకు ఒక శాతం రుసుము విధిస్తారు.

మీరు ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫాములపై ఎంత మొత్తంలో ఖర్చు చేసినా కూడా నెలకు ఆ రుసుము రూ.4,999 గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరిమితం చేసింది. సేవా చార్జీలు అలాగే వినియోగ నిబంధనలను ఐసిఐసిఐ బ్యాంకు కూడా ఇటీవల సవరించింది. ఐసిఐసిఐ బ్యాంకు కస్టమర్లు నగదు డిపాజిట్లు, చెక్కులు, డిమాండ్ డ్రాఫ్టులు, పే ఆట లావాదేవిలు వంటివి చేసినప్పుడు ప్రతి 1000 రూపాయలకి రెండు రూపాయలు రుసుము చెల్లించాలి. ఐసిఐసిఐ బ్యాంక్ ఎటిఎం చార్జీలు కూడా పెరిగినట్లు ప్రకటించింది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now