UPI Payments: తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ పేమెంట్స్ పై కీలక నిర్ణయం తీసుకుందని సమాచారం. ఈ నిర్ణయం ప్రకారం యూపీఐ వ్యక్తి నుంచి వ్యాపారానికి చేసే లావాదేవీ పరిమితులను త్వరలో సవరిస్తామని ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలో వినియోగదారులు వ్యాపారస్తులకు చేసే యూపీఐ చెల్లింపుల పరిమితిని తమకు అనుగుణంగా పెంచుకునే అవకాశం ఉంటుంది. తాజాగా ఈ క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు అనుమతిని జారీ చేసింది.
త్వరలో యూపీఐ ద్వారా పేమెంట్ చేసే వారికి వ్యక్తి నుంచి వ్యాపారానికి లావాదేవీల పరిమితులను సవరిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా ద్రవ్య పరిమితి విధాన సమీక్ష సమావేశ నిర్ణయాలను వెల్లడిస్తూ ఈ తాజా ప్రకటన చేశారు. కానీ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తి లావాదేవీల పరిమితి లక్ష రూపాయలు గానే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అయితే వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి అలాగే వ్యక్తి నుంచి వ్యాపారస్తుడికి రెండిటికి యూపీఐ పరిమితి లక్ష రూపాయలుగా ఉంటుంది.
కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న తాజా నిర్ణయంతో వ్యక్తి నుంచి వ్యాపారస్తుడికి చేసే ట్రాన్సాక్షన్ పరిమితి రెండు లక్షల నుంచి 5 లక్షల వరకు తమ అవసరాన్ని బట్టి పెంచుకోవచ్చు. ఈ క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇతర ఆర్థిక సంస్థలతో చర్చించిన తర్వాత వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వ్యక్తి నుంచి వ్యాపారస్తుడికి లావాదేవీల పరిమితిని పెంచుకోవచ్చు అంటూ ఎన్పీసీఐకి అనుమతి జారీ చేసింది.
ఈ క్రమంలో త్వరలో వ్యక్తి నుంచి వ్యాపారానికి లావాదేవీ పరిమితులను సవరించనుంది. వినియోగదారులు వ్యాపారులకు చేసే యూపిఐ చెల్లింపుల పరిమితిని తమ అవసరాలకు బట్టి పెంచుకోవచ్చు. అయితే యూపీఐ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చడానికి మరియు వినియోగాన్ని పెంచడానికి ఆర్బిఐ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇతర ఆర్థిక సంస్థలకు, బ్యాంకులకు అనుగుణంగా యూపీఐ ఎకో సిస్టం లోని వాటాదారులను సంప్రదించి ఈ పరిమితిని సర్దుబాటు చేసుకునే స్వేచ్ఛ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐకి అప్పగించింది.