Apple Iphone: మన దేశానికి ఆపిల్ ఐఫోన్ ఉత్పత్తిని తరలించడం మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక వరం అని చెప్పొచ్చు. ఈ క్రమంలో భారతదేశం ఉద్యోగం సృష్టి, ఎగుమతి ఆదాయం, విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో కొత్త ఎత్తులకు చేరుకునే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని మన దేశం సద్వినియోగం చేసుకోవాలంటే ప్రభుత్వం పరిశ్రమలు కలిసి ఈ సవాళ్లను అధిగమించాలి. తాజాగా ఆపిల్ తీసుకున్న నిర్ణయం మన దేశాన్ని ఒక గ్లోబల్ టెక్ హబ్ గా మార్చే మొదటి అడుగు కావచ్చు.
తాజాగా టెక్ దిగ్గజం ఆపిల్ కంపెనీ తన ఐఫోన్ ఉత్పత్తిని భారతదేశానికి మారుస్తున్నట్లు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2025 ఏడాది చివరి నాటికి ప్రతి నాలుగు ఐఫోన్లలో ఒకటి భారతదేశంలో తయారవుతుందని అంచనా వేయవచ్చు. వాల్ స్ట్రీట్ జనరల్ నివేదిక ప్రకారం ఈ నిర్ణయం వెనుక అమెరికా చైనా ఉత్పత్తులపై విధించిన 54 శాతం టారిఫ్ లను నివారించే ప్రయత్నం ఉందని చెప్తున్నారు.
అయితే తాజాగా తీసుకున్న ఈ మార్పు భారత దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి పోసే అవకాశం ఉన్నప్పటికీ అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. భారతదేశంలో ఆపిల్ కంపెనీ ఐఫోన్ ఉత్పత్తిని విస్తరించడం వలన 2025 ఆర్థిక సంవత్సరంలో ఆరు లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటిలో రెండు లక్షల ఉద్యోగాలు ఫాక్స్ గాన్ అలాగే పెగడ్రాన్ వంటి సరఫరాదారుల వద్ద నేరుగా ఉంటాయి.
వీటితోపాటు లాజిస్టిక్స్, కాంపోనెంట్ తయారీ, రిటైల్ రంగాలలో కూడా కొన్ని లక్షల పరోక్ష ఉద్యోగాలు ఉంటాయి. ముఖ్యంగా ఇది భారతదేశంలో ఉన్న నిరుద్యోగ సమస్యను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది అంటూ ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో భారత దేశంలో ఐఫోన్ ఎగుమతులు ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్లకు చేరుకున్నాయి. అయితే ఇది సాంప్రదాయ టెక్స్టైల్ ఎగుమతులను అధిగమించి భారతదేశ అనుమతి ఆదాయాన్ని వైవిధ్యీకరణ చేస్తుందని తాజా నివేదికలు చెబుతున్నాయి.