EMPLOYES GOOD NEWS: ఈ ఏడాది ప్రారంభంలోనే కేంద్ర ప్రభుత్వం ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు చేసినట్లే ప్రకటించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 2025లో ప్రస్తుత వేతన నిర్మాణం ముగుస్తున్న కారణంగా ముందుగానే ఈ ప్రకటన కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులలో మరియు పదవీ విరమణ పొందిన వారిలో ఈ సంఘం ఏర్పాటుతో భారీగా ఆశలు నెలకొన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మరియు పదవీ విరమణ పొందిన వాళ్ళ వేతనాలను, పెన్షన్లను, అలవెన్స్లను ఈ సంఘం సమీక్షించబోతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఎనిమిదో వేతన సంఘంలో చైర్మన్ తో పాటు 42 కన్సల్టెంట్ లాగా కీలక పోస్టులకు భర్తీ చేయడంపై కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
ఈ సంఘం టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ ఫైనల్ అయిన వెంటనే తన పనిని మొదలు పెడుతుంది. ముఖ్యంగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పై దృష్టి పెట్టనున్నారు. ముఖ్యంగా ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన మరియు పదవీ విరమణ పొందిన వారి పెన్షన్ పెరుగుదలలో కీలకపాత్ర పోషించనుంది. కొత్త వేతన సంఘం అమలులోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కొత్త ప్రాథమిక వేతనాన్ని లెక్కించేందుకు ఉపయోగించే గుణంకాన్ని ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అంటారు. ఒకే విధంగా వేతనాలను పెంచేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది.
కొత్త వేతన సంఘంలో కొత్త బేసిక్ పే ని పాత బేసిక్ పే తో ఫిట్మెంట్ ఫాక్టర్ గునిస్తారు. గతంలో ఉన్న ఏడో వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57. ఉదాహరణకు పాత బేసిక్ పే 10 వేల రూపాయలు అయితే కొత్త బేసిక్ పెయిన్ ఈ విధంగా లెక్కిస్తారు 10000*2.57=₹25,700. ప్రస్తుతం ఎనిమిదవ వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.86 గా ఉన్నట్లయితే ఒకవేళ కేంద్ర ప్రభుత్వం 2.86 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ సిఫార్సు చేసినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనంలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే ప్రస్తుతం బేసిక్ పే 20,000 అయితే కొత్త బేసిక్ పే =20,000*2.86=₹57,200.