Grawel illegal: కుందేళ్ళ గుట్టలో మళ్ళీ మోరం దందా
మెట్ పల్లి, జూన్ 8 (ప్రజా శంఖారావం): మెట్ పల్లి మండలం మెడిపల్లి శివారు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కుందేళ్ళ గుట్టలో మళ్లీ మొరం దందా కొనసాగుతుంది.శనివారం అర్ధ రాత్రి కుందేలు గుట్టకు మెరం అక్రమంగా తవ్వుతుండగా మూడు ట్రాక్టర్లు,ఒక జెసిబి పట్టుకొని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించి సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు.కోరుట్ల ఎమ్మెల్యే ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ప్రత్యక్షంగా వెళ్లి జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ కు ఫిర్యాదు చేసిన మొరం దందా కొనసాగుతుందంటే దీని వెనకాల రాజకీయ నేపథ్యం ఎంతో ఉన్నట్లు తెలుస్తోంది.ఇప్పటికైనా అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలవంచకుండా మొరం అక్రమ దందా ఆపి ప్రకృతికి నష్టం జరగకుండా చూడాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి
Join WhatsApp Group
Join Now