Gold Investment: బంగారం ధర రోజు,రోజుకు ఆకాశాన్ని అంటుతోంది. ఎప్పుడు ఒకేతీరు ఉంటలేదు. కొద్దిగా అటు,ఇటుగా తగ్గినప్పటికీ క్రమ,క్రమంగా పెరుగుతూనే ఉంది. కొనడం కూడా మధ్యతరగతి వారికి ఇబ్బందిగానే ఉంది. లక్ష రూపాయలు దాటడంతో కొనుగోలు దారులు తలపట్టుకోక తప్పడంలేదు. అయితే బంగారంలో పెట్టుబడి పెడితే మాత్రం మీరు కోటీశ్వరులు కావడం ఖాయమంటున్నారు కొందరు ఆర్థిక నిపుణులు. అదే ఎలా అంటే ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా గత కొన్నేళ్ల నుంచి ప్రత్యక్షంగా బంగారం కొనుగోలు చేస్తున్నారు. బంగారు నగలు కొంటె తరుగు, కూలీ వంటి చార్జీలు వ్యాపారాలు వేస్తారు. తిరిగి అదే వస్తువును అమ్మితే ఎక్కువ నష్టపోవాల్సి ఉంటుంది. నగలను కొనడం కంటే డిజిటల్ గోల్డ్ లో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. డిజిటల్ గోల్డ్ లో పెట్టుబడి పెట్టిన వారికీ సమానంగా ఆదాయం చేతికందుతుంది. ఈ పద్దతి వలన ఎలాంటి ఆర్థిక నష్టాలు ఉండవు.
ఇతర మ్యూచువల్ ఫండ్ల లో ఏ విదంగా పెట్టుబడి పెడుతున్నామో, అదేవిదంగా గోల్డ్ ఇటిఎఫ్లలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంది. డిజిటల్ గోల్డ్ పద్దతిలో గ్రాముల ప్రకారం బంగారం కొనడానికి అవకాశం ఉంది. ఒక గ్రాము నుంచి ఎంతయినా కొనవచ్చు. కనీసం వెయ్యి రూపాయల నుంచి ఆ పైబడి ఎంత బంగారం అయినా కొని పెట్టుబడి పెట్టవచ్చు. ప్రధానమైన అప్స్ లల్లో డిజిటల్ గోల్డ్ లో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంది. గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ అనేవి ప్రధానమైనవి. ఇది గోల్డ్ బులియన్ ధరపై ఆధారపడినటువంటి ఫండ్. ఈ విదంగా పెట్టుబడి పెట్టిన బాండ్లను షేర్ మార్కెట్ లో అమ్మడానికి అవకాశం ఉంది. అదే విదంగా కొనడానికి అవకాశం కూడా ఉంది.