Counsel to the Minister: హైదరాబాద్, అక్టోబర్ 02 (ప్రజా శంఖారావం): తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి ఇటీవలే మృతి చెందారు. బుధవారం హైదరాబాద్ కొండాపూర్ లోని మంత్రి నివాసంలో పురుషోత్తం రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఆయన సతీమణి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిని వారి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. పరామర్శించిన వారిలో మాజీమంత్రి కడియం శ్రీహరితో పాటు బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి ఉన్నారు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి
Join WhatsApp Group
Join Now