New Rules: బ్యాంకింగ్ నుంచి గ్యాస్ సిలిండర్ల వరకు.. జూన్ 1 నుంచి జరిగే 6 కొత్త మార్పులు ఇవే

New Rules
New Rules

New Rules: బ్యాంకింగ్ నుంచి గ్యాస్ సిలిండర్ ల వరకు కూడా జూన్ నెల నుంచి 6 కొత్త మార్పులు రానున్నాయి. ఈ కొత్త మార్పులతో సామాన్యులపై ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. జూన్ నెల నుంచి గ్యాస్ సిలిండర్ ధరలో, క్రెడిట్ కార్డు చార్జీలు, జిఎస్టి ఇలా అనేక కొత్త నిబంధనలు అమలులోకి రాబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం జూన్ 1వ తేదీ నుంచి ఈపీఎఫ్ఓ కొత్త వర్షన్ 3.0 ప్రవేశ పెట్టబోతుంది. గతంలో కన్నా పీఎఫ్ ఖాతా నుంచి పీఎఫ్ డబ్బులు అని విత్డ్రా చేయడం, లైన్ చేయడం లేదా వివరాలను అప్డేట్ చేయడం వంటి అన్ని సర్వీసులు చాలా సులభంగా ఉంటాయి.

పీఎఫ్ ఖాతా నుంచి మీరు ఏటీఎం లాంటి కార్డుతో డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డులను ఉపయోగించేవారు ఆటో డెబిట్ ఫెయిల్ అయితే కనుక వాళ్లు రెండు శాతం వరకు జరిమానా చార్జీ చెల్లించాలి. అలాగే క్రెడిట్ కార్డు ను ఉపయోగించే యుటిలిటీ బిల్లు మరియు ఫ్యూయల్ కోసం మీరు కార్డును ఉపయోగించినట్లయితే అదనపు చార్జీలు చెల్లించాలి. ఏటీఎం నుంచి డబ్బులు అను విత్ డ్రా చేసేవారికి జూన్ ఒకటవ తేదీ నుంచి భారీగా చార్జీలు పడతాయి.

మీకు ఉన్న పరిమిత ట్రాన్సాక్షన్ల ఫ్రీ లావాదేవీల తర్వాత మీరు చేసే ప్రతి లావాదేవీ పై కూడా చార్జ్ విధిస్తారు. ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలను ప్రతినెల 1వ తేదీన నిర్ణయిస్తారు. ఈ క్రమంలో గ్యాస్ సిలిండర్ ధర జూన్ 1వ తేదీన మరింత ఖరీదైన జిల్లా లేదా చౌకగా కూడా మారవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమావేశం జూన్ 6వ తేదీన జరగనుంది. ఆర్బిఐ ఈ సమావేశంలో రేపో రేటు తగ్గించవచ్చు. ఇదే కనుక జరిగితే ఎఫ్డి ల పై బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు తగ్గిస్తాయి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now