Todays Gold Rate: సామాన్యులకు అందని ఎత్తులో పసిడి.. లక్ష మైలురాయి దాటిన ఆగని పసిడి పరుగు

Todays Gold Rate
Todays Gold Rate

Todays Gold Rate: బంగారం మళ్లీ పరుగులు పెడుతుంది. ఇరాన్ మరియు ఇజ్రాయిల్ దేశాల మధ్య దాడులు జరుగుతున్న క్రమంలో పెట్టుబడిదారులు బంగారంపై ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తుండడంతో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. తాజాగా బంగారం లక్ష మార్కును దాటి పరుగులు పెడుతుంది. రెండు నెలల క్రితం తులం బంగారం ధర లక్ష రూపాయలు దాటి ఆ తర్వాత మళ్లీ క్రమంగా తగ్గింది. కానీ ప్రస్తుతం మళ్ళీ తులం బంగారం ధర లక్ష రూపాయలు దాటింది.

ఏ సీజన్లో అయినా బంగారానికి మరియు వెండి కి మార్కెట్లో డిమాండ్ బాగా ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. మనదేశంలో బంగారం మరియు వెండి ధరలు బులియన్ మార్కెట్లో ఉన్న బంగారం మరియు వెండి ధరలపై ఆధారపడి ఉంటాయి. ట్రంప్ టారిఫ్స్ బెదిరింపులు అలాగే యూఎస్ ద్రవ్యోల్బణం కారణంగా కూడా పెట్టుబడిదారులు బంగారం మీద ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. బంగారం ఒక్క రాత్రిలో ఔన్స్ కు 50 డాలర్లు పెరిగిందని తెలుస్తుంది.

ఈరోజు జూన్ 15, 2025 దేశవ్యాప్తంగా స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర మార్కెట్లో రూ.1,01,680, 22 క్యారెట్ల తులం బంగారం ధర మార్కెట్లో రూ.93,200 గా ఉన్నాయి. ఇక కిలో వెండి ధర మన దేశ మార్కెట్లో రూ.1,10,000 గా ఉంది. మనదేశంలో పలు ముఖ్యమైన నగరాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ముంబై, చెన్నై, బెంగళూరు మరియు కోల్కతా వంటి నగరాలలో స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర ఈరోజు రూ.1,01,680, 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.93,200, కిలో వెండి ధర రూ.1,20,000 గా ఉన్నాయని సమాచారం. ఇక దేశ రాజధాని ఢిల్లీలో స్వచ్ఛమైన తులం బంగారం ధర ఈరోజు రూ.1,01,830, 22 క్యారెట్ల తులం బంగారం ధర ఈరోజు రూ.93,350, కిలో వెండి ధర రూ.1,10,000 గా ఉన్నాయి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now