Todays Gold Rate: మహిళలు ఏదైనా ఒక వస్తువు బాగా ఇష్టపడతారు అనుకుంటే అది బంగారమే అని చెప్పడంలో సందేహం లేదు. మన దేశంలో మహిళలు ఏ చిన్న సందర్భం వచ్చినా కూడా ముందుగా బంగారాన్ని కొనుగోలు చేస్తారు. అలాగే బంగారాన్ని కానుకగా ఇవ్వడం కూడా మన దేశ సంప్రదాయంలో భాగంగా మారిపోయింది. దీనిని కేవలం ఒక ఆభరణంగా మాత్రమే కాకుండా మంచి పెట్టుబడి సాధనం గా కూడా మన దేశ పౌరులు భావిస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో భారీగా పెరుగుతున్న బంగారం ధరలు అందరికీ ఆందోళన కలిగిస్తున్నాయి.
దీంతో పెళ్లిళ్లలో కూడా పసిడి కొనుగోలు చేయడానికి సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆలోచిస్తున్నారు. పసిడి ధరలు ఈ రేంజ్ లో పెరగడానికి ముఖ్య కారణం అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు అని చెప్పొచ్చు. డాలర్ విలువ తో రూపాయి మారకం విలువ కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తుంది. అయితే ఈరోజు మాత్రం బంగారం కొనడానికి భావిస్తున్న వారికి ఒక మంచి శుభవార్త అని చెప్పొచ్చు. ఈరోజు పసిడి ధరలు కాస్త తగ్గినట్లు తెలుస్తోంది.
జూన్ 17, మంగళవారం నా దేశ మార్కెట్లో స్వచ్ఛమైన తులం గోల్డ్ రేటు రూ.1,01,500, 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.93,040 గా ఉన్నాయి. ఇక నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు తులం బంగారం పై పది రూపాయలు ధర తగ్గినట్లు తెలుస్తోంది. ఇక మన దేశంలో పలు ప్రముఖ నగరాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, ముంబై, బెంగళూరు వంటి నగరాలలో ఈరోజు స్వచ్ఛమైన తులం పసిడి రూ.1,01,500, 22 క్యారెట్ల తులం పసిడి రూ.93,050 గా ఉన్నాయి. ఇక ఈ నగరాలలో ఈరోజు కిలో వెండి ధర రూ.1,19,800 గా ఉందని సమాచారం.