Inter Result :ఇంటర్ అడ్వాన్స్ పరీక్ష ఫలితాలు.. ప్రకటించేది ఆ రోజే..
తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు ఇంటర్మీడియేట్ బోర్డు అడ్వాన్స్ పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలు మే 29న ముగిశాయి. పరీక్షలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఆర్ట్స్ మరియు సైన్స్ విద్యార్థులు హాజరైనారు. గతంలో ఎప్పుడు కానంత మంది విద్యార్థులు ఈ సారి 4.2 లక్షల మంది విద్యార్థులు అడ్వాన్స్ పరీక్షకు హాజరు కావడం విశేషం. కొందరు అనుత్తీర్ణులైన విద్యార్థులతో పాటు, అధిక మార్కుల కోసం మరికొందరు విద్యార్థులు అడ్వాన్స్ పరీక్షకు హాజరైనారు.
4.2 లక్షల మంది పరీక్షకు హాజరైనారు. పరీక్ష నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగ ప్రభుత్వ కళాశాలను ఎంపిక చేశారు. మొత్తం 892 కళాశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు బోర్డు అధికారులు. మొదటి సంవత్సరం ఆర్ట్స్ మరియు సైన్స్ విద్యార్ధులకి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పరీక్ష నిర్వహించారు. అదే విదంగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి సాయంత్రం ఐదున్నర వరకు పరీక్షలు నిర్వహించారు
పరీక్షకు హాజరైన విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ఇటీవలనే ముగిసింది. ఫలితాలను, మార్కులను జిల్లాలవారీగా కంప్యూటరీకరణ చేయడం కూడా పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియేట్ బోర్డు అధికారులు ఫలితాలను ప్రకటించనున్నామని ప్రకటించారు. జూన్ 16 న సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేయనున్నామని బోర్డు అధికారులు ప్రకటించడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.