LOC grant from CM’s relief fund: ఎల్ఓసి అందజేసిన వినయ్ రెడ్డి

LOC Distribute
LOC Distribute

LOC grant from CM’s relief fund: ఆర్మూర్ టౌన్, అక్టోబర్ 01 (ప్రజా శంఖారావం): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని మామిడిపల్లి 7వ వార్డుకు చెందిన గంగామణి అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఆమె ఆరోగ్య రీత్యా ఆర్థిక సాయం కోసం ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డిని కుటుంబ సభ్యులు సంప్రదించారు.

స్పందించిన ఆయన సీఎం సహాయ నిధి నుండి 2.5 లక్షల రూపాయల ఎల్ఓసిని మంగళవారం బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా బాధితురాలి కుటుంబ సభ్యులు వినయ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సాయిబాబా గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు చిట్టి రెడ్డి, రాజు, చంద్రశేఖర్ రెడ్డి, ఎలియా రెడ్డి, శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now