Raitu Bharosa: రైతులకు గుడ్ న్యూస్.. రైతు భరోసా నిధులు విడుదల..

Raitu Bharosa
Raitu Bharosa

Raitu Bharosa: రైతులకు గుడ్ న్యూస్.. రైతు భరోసా నిధులు విడుదల..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం శుభవార్త ప్రకటించారు. మంగళవారం నుంచి రైతలకు రైతు భరోసా ఇవ్వనున్నామని మంత్రి వర్గ సమావేశం అనంతరం ప్రకటించారు. మంత్రులతో సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి భరోసా పై నిర్ణయం తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై కూడా మంత్రివర్గంలో చర్చ జరిగింది.

వానాకాలం పంట పెట్టుబడి కోసం రైతులకు రైతు భరోసా అందజేస్తున్నామని సీఎం ప్రకటించారు. ఎకరానికి ఆరువేల రూపాయల చొప్పున ఇవ్వనున్నామన్నారు. ఒక గుంట భూమి సాగుచేస్తున్న రైతుకు కూడా రైతు భరోసా అందిస్తామన్నారు. రైతు బ్యాంకు ఖాతాల్లో మంగళ వారం నుంచే డబ్బులు జమ అవుతాయన్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now