Operation Sindoor: భారత్, పాక్ కాల్పుల విరమణ వెనుక ఉన్న.. అసలు కారణం ఇదే..!

Operation Sindoor
Operation Sindoor

Operation Sindoor: అంతర్జాతీయ రాజకీయ ఒత్తిడిలో భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణలో కీలక పాత్ర పోషించినట్లు ఇటీవల అంతర్జాతీయ మీడియా నివేదికలు చెప్తున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి ఒక బిలియన్ డాలర్ల రుణం పొందేందుకు పాకిస్తాన్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న కారణంగా అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి రుణం పొందేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో అమెరికా ఆధ్వర్యంలో ఒత్తిడి పెరిగిన కారణంగా పాకిస్తాన్ సీస్ ఫైర్ కు అంగీకరించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

పాకిస్తాన్ అమెరికా అనుమతి లేకుండా అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి ఋణం మంజూరు కాదన్న విషయాన్ని గ్రహించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే మే 9, 2025 శుక్రవారం ఐ ఎం ఎఫ్ పాకిస్తాన్ కు ఒక బిలియన్ డాలర్ల రుణాన్ని ఆమోదించినట్లు తెలుస్తుంది. ఏడు బిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ ప్యాకేజీలో ఇది భాగం. ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి పోసేందుకు ఈ రుణం చాలా కీలకంగా మారింది. 2024లో పాకిస్తాన్ 130 బిలియన్ డాలర్ల విదేశీ అప్పుల భారంతో కొట్టుమిట్టు లాడుతున్న సంగతి తెలిసిందే.

అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం ఈ రుణం ఆమోదం పొందడానికి భారత సీజ్ ఫైర్ ప్రకటించడం ఒక షరతుగా మారిందని చెప్తున్నారు. అయితే మరొక ఈ రుణాన్ని తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తుంది. ఉగ్రవాద కార్యకలాపాలకు ఈ నిధులు దుర్వినియోగం కావచ్చు అనే ఆందోళన భారత్ వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలో ఈ రుణాన్ని సీజ్ ఫైర్ అంగీకారానికి అనుసంధా నించే అమెరికా పాకిస్తాన్ పై ఒత్తిడి చేసినట్లు కూడా మీడియా కథనాలు వినిపిస్తున్నాయి. ఐఎంఎఫ్ జరిగిన సమావేశంలో భారత ఈ ఋణం ఆమోదంపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. గతంలో కూడా ఐఎంఎఫ్ రుణాలను పాకిస్తాన్ దేశం సరిగా ఉపయోగించుకోలేదని, సరిహద్దు ఉగ్రవాద కార్యకలాపాలకు ఈ నిధులు దుర్వినియోగం కావచ్చు అని భారతదేశం ఐఎంఎఫ్ ను హెచ్చరించింది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now