Covid: ఈ మధ్యకాలంలో కోవిడ్ 19 కొత్త వేరియం కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ లక్షణాలను తగ్గించుకోవడానికి ఆవిరి పట్టడం, తులసి కషాయం తాగడం, వెల్లుల్లి, అల్లం తేనె, పసుపు కలిపిన పాలు, నిమ్మరసం వంటివి చాలా బాగా ఉపయోగపడతాయి. 2020 నుంచి కోవిడ్ 19 మనుషుల జీవితాన్ని గందరగోళం చేస్తుంది. రీసెంట్ గా కొత్త వేరియంట్ కేసులు మళ్లీ దేశవ్యాప్తంగా నమోదవుతున్నాయి. ఇప్పటికే కోవిడ్ 19 కోసం మెరుగైన వైద్య సౌకర్యాలతో పాటు వ్యాక్సిన్లు కూడా అందుబాటులో ఉన్నప్పటికీ మనం కూడా తగిన జాగ్రత్త తీసుకోవడం ఎంతో అవసరం.
అయితే కామన్ గా కనిపించే లక్షణాలలో గొంతు నొప్పి, తేలికపాటి జ్వరం, అలసట వంటివి ఉన్నాయి. ఇటువంటి స్వల్ప లక్షణాలు కనిపిస్తే మీరు భయపడాల్సిన పనిలేదు. కొంచెం జాగ్రత్త పడితే సరిపోతుంది. ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో ఈ లక్షణాలను తగ్గించుకోవచ్చు. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. ఈ కోవిడ్ లక్షణాలు తగ్గడానికి తులసి, నల్ల మిరియాలతో కషాయం తయారు చేసుకుని తాగాలి. గొంతు సమస్యలను ఇది తగ్గించి జ్వరాన్ని కూడా తగ్గించడంలో భాగ సహాయం చేస్తుంది. తులసిలో ఉండే ఆంటీ వైరల్ గుణాలు ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని బలంగా చేస్తాయి.
శ్వాస కోసం ఇన్ఫెక్షన్లను కూడా తులసి 30% వరకు తగ్గిస్తుంది. రోజుకు రెండుసార్లు తులసి తో చేసిన ఈ కషాయం తాగితే శరీరం కూడా చాలా రిలాక్స్ గా మారుతుంది. ఈ కషాయం తయారు చేసుకోవడానికి మీరు పది తులసి ఆకులు, కొన్ని మిరియాలు నీటిలో మరిగించి వడకట్టుకోవాలి. మీకు స్వలప లక్షణాలు కనిపించినప్పుడు రోజుకు రెండుసార్లు ఆవిరి పట్టడం వలన కూడా దీని నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆవిరి పట్టడం వలన గొంతు నొప్పి, ముక్కుదిబ్బడ, తలనొప్పి వంటివి తగ్గుతాయి. శ్వాసకోస వ్యవస్థను ఆవిరి శుభ్రపరిచి సైనా సమస్యలను కూడా తగ్గిస్తుంది.