Tribute to death: పసుపు బోర్డు సాధన నాయకుని మృతికి ఘన నివాళి

Tribute to death
Tribute to death

Tribute to death: ఆర్మూర్ టౌన్, సెప్టెంబర్ 15 (ప్రజా శంఖారావం): అలుపెరుగని పోరాట యోధుడు, పసుపు బోర్డు సాధన కోసం నిరంతరం కృషిచేసిన ముత్యాల మనోహర్ రెడ్డి అనారోగ్య కారణాలతో శనివారం సాయంత్రం హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. హైదరాబాదులోని ఆయన నివాసంలో ఉంచిన భౌతిక కాయానికి ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆదివారం ఘనంగా నివాళులర్పించారు.

పసుపు బోర్డు సాధన కోసం పాదరక్షలు లేకుండా పాదయాత్ర చేసిన మహోన్నత వ్యక్తి అని ఆయనను స్మరించుకున్నారు. కాగితాలకే పరిమితమైన పసుపు బోర్డు నిర్మాణం జరిగినప్పుడే ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుందని వినయ్ రెడ్డి అన్నారు. పసుపు బోర్డు సాధన కోసం నిరంతరం పోరాటం చేసిన ఆయన పోరాట ప్రతిమను గుర్తు పెట్టుకోవాలని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. నివాళులు అర్పించిన వారిలో కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ రెడ్డి తో పాటు ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, దేవరం, పలువురు ఉన్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now