TRAFFIC JAM: రెండు లారీలు ఢీ.. నిలిచిపోయిన ట్రాఫిక్

TRAFFIC JAM
TRAFFIC JAM

TRAFFIC JAM: మెట్ పల్లి, ఏప్రిల్12 (ప్రజా శంఖారావం): మెట్ పల్లి పట్టణ శివారులోని ఎస్సారెస్పీ కాలువ వంతెన పై శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు వంతెన పై ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఓ లారీ డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కుపోయడు. పోలీసులు రెండు గంటలపాటు శ్రమించి బయటకు తీశారు.

కరీంనగర్ నుంచి మహారాష్ట్ర వెళ్తున్న గ్రానైట్ లారీ జగిత్యాల వైపు వెళ్తున్న మరో లారి వంతెన పై ఎదురుగా ఢీకొన్నాయి. ఈ సమాచారo అందుకున్న మెట్ పల్లి, ఇబ్రహీంపట్నం ఎస్సైలు కిరణ్ కుమార్, అనిల్ కుమార్ ఘటన స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు.జెసిబి సాయంతో క్యాబిన్ ను కొద్దిగా తొలగించి అతి కష్టం మీద డ్రైవర్ ను బయటకు తీశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటనతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now