Inter Results For AP 2025: రాష్ట్రవ్యాప్తంగా ఎప్పుడుడేప్పుడు అని ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్ విద్యార్థుల ఫలితాలు మరి కాసేపట్లో విడుదల కానున్నాయి. 2024 – 25 సంవత్సరానికి పరీక్షలు రాసిన ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థుల ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ప్రకటించింది. ఫలితాలు విడుదలకు సంబంధించి ఏపి ఇంటర్ బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్లో, వాట్సాప్ నెంబర్ ను https ://resultsbie .ap .gov .in లో చెక్ చేసుకోవచ్చు.మన మిత్ర అనే వాట్సాప్ నెంబర్ 9552300009 అనే నెంబర్ కు Hi అని మెసేజ్ పంపి తక్షణమే ఫలితాలను పొందొచ్చు.
గత నెల మార్చిలో 1 నుండి 20వ తేది వరకు ఇంటర్ రెగ్యులర్ విద్యార్థుల ఎగ్జామ్స్ నిర్వహించారు. మార్చి మూడు నుంచి 15 వరకు ఓపెన్ స్కూల్ సొసైటీ విద్యార్థుల పరీక్షలు జరిగాయి. పరీక్షలు ముగిసిన 20 రోజుల్లోనే అధికారులు ఇంటర్మీడియట్ విద్యార్థుల ఫలితాలను వెల్లడించడానికి అన్ని విధాల ఏర్పాట్లను పూర్తి చేసి నేడు ఇంటర్ బోర్డు ఆధ్వర్యంలో విద్యార్థుల ఫలితాలు విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశారు.
మొదటి సంవత్సరం విద్యార్థులు తమ పరీక్షలు పూర్తి కాగానే ఈనెల ఒకటి నుండి అన్ని ఇంటర్మీడియట్ కళాశాలలో సెకండ్ ఇయర్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభమయ్యాయి. ఫలితాలు వెలువడే లోపు మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరైన విద్యార్థులకు రెండవ సంవత్సరం ప్రవేశానికి క్లాసులు ప్రారంభం కాగా వివిధ కళాశాలలో బ్రిడ్జి కోర్సు క్లాసులను నిర్వహిస్తున్నారు.