Police Press Meet: ద్విచక్ర వాహనాల దొంగల అరెస్ట్

Police Press Meet (2)
Police Press Meet (2)

Police Press Meet: మెట్ పల్లి, ఆగస్టు 10 (ప్రజా శంఖారావం): బైక్ దొంగతానలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను అరెస్ట్ చేసి రిమాండ్ కూ తరలిస్తున్నట్లు జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ తెలిపారు. 

శనివారం మెట్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ దొంగల వివరాలను వెల్లడించారు. జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలోని పలు హోటళ్ళు, హాస్పిటల్లో పార్క్ చేసిన బైక్ లను దొంగలించడం అలవర్చుకొని వచ్చిన సొమ్ముతో జల్సాలు చేసేవారన్నారు.

సుమారు 20 బైక్ లను వారి వద్ద నుండి స్వాదీనం చేసుకొన్నట్లు చెప్పారు. బైక్ దొంగలని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిఐ నిరంజన్ రెడ్డి, ఎస్ఐ చిరంజీవి, కానిస్టేబుల్స్ కిరణ్, సంతోష్ లను ఆయన్ అభినంధించి నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఉమా మహేశ్వర రావు, సిఐ నిరంజన్ రెడ్డి, ఎస్ఐ చిరంజీవి, కానిస్టేబుల్స్ కిరణ్, సంతోష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now