Nizamabad Crime: నిజామాబాద్ జిల్లా, ఆగస్టు 18 (ప్రజా శంఖారావం): నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఆదివారం పసికందు మృతదేహం లభ్యమయింది. గుర్తుతెలియని వ్యక్తులు నవజాత శిశువును మురికి కాలువలో పడేయడం విషాదకరమని స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. పురిటి నొప్పుల మధ్య పురుడు పోసుకున్న పసికందు మురికి కాలువ లో దర్శనమివ్వడంపై మానవత్వం మంట కలిసి పోతుందని పలువురు మండిపడుతున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో పసికందు మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి
Join WhatsApp Group
Join Now